E-Paper
Advertisement

గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు

గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు
Advertisement

Guwahati: ఏపీ సీఎం చంద్రబాబు గౌహతి చేరుకున్నారు.  మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే నేతలు అక్కడికి తరలివస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా గౌహతికి చేరుకున్నారు.

గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్

Advertisement

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి నేరుగా అస్సాం రాజధాని గౌహతికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ కూడా హాజరయ్యారు.

మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పెద్దలు అంతా వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అయితే మంత్రి లోకేష్‌కు బిశ్వశర్మ ప్రత్యేకంగా ఆహ్వానించారు. సింగపూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుని మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు‌తో కలిసి రాత్రి గౌహతికి చేరుకున్నారు.

Advertisement

ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం.. బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు

సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్‌లకు గౌహతిలో ఘన స్వాగతం లభించింది.  బీజేపీ  నేతలు విమానాశ్రయంలో  చంద్రబాబు టీమ్‌కు ఆహ్వానం పలికారు. అస్సాం సంస్కృతికి ప్రతీక జాపి టోపీ, గమోసా కండువాతో సీఎం చంద్రబాబును గౌరవించారు. అక్కడి సాంప్రదాయంలో ముఖ్యమంత్రి సరికొత్తగా కనిపించారు.

ఇలాంటి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మాత్రమే హాజరయ్యేవారు. అయితే హేమంత బిశ్వశర్మ ప్రత్యేకంగా ఆహ్వానించడంతో మంత్రి లోకేష్ హాజరయ్యారు. తండ్రీకొడుకులు అస్సాం సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు చిక్కారు. అస్సాం ఆత్మీయతకు.. ఆంధ్ర చురుకుదనానికి ఇదొక చక్కని ఉదాహరణ!

ALSO READ: 17 రాష్ట్రాలు, 5 యూటీల్లో.. మూడో దశ S.I.Rకి రంగం సిద్ధం

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×