BigTV English

Delhi Crimes : పట్టపగలు నడిరోడ్డుపై ఢిల్లీలో బాలికపై యాసిడ్ అటాక్..

Delhi Crimes : పట్టపగలు నడిరోడ్డుపై ఢిల్లీలో బాలికపై యాసిడ్ అటాక్..

Delhi Crimes : ఢిల్లీలో నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 10 ఏళ్ల క్రితం నిర్భయ లాంటి ఘటనలో ఇప్పటి వేలల్లో రిపీట్ అయి ఉంటాయి. శ్రద్ధా వాకర్ దారుణ హత్య కేసు మరువక ముందే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం ఓ బాలుడు తాను చదువుతున్న పాఠశాలలోని బాలిక పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.


బాలికపై బాలుడి యాసిడ్ దాడి దృష్యాలు కెమెరాకు చిక్కాయి. అయితే బాలుడి ఎందుకు ఆ బాలికపై యాసిడ్ దాడి చేసాడనే వివరాలు తెలియాల్సిం ఉంది. బాలుడి నిజంగా అదే పాఠశాలో చదువుతున్నాడా..? లేక వేరే పాఠశాలలో చదువుతున్నాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

యాసిడ్ ముఖంపైన చల్లడంతో ముఖంతో పాటు కళ్లల్లోకి కూడా యాసిడ్ వెళ్లిందని బాధితురాలి తండ్రి మీడియాకు వివరించాడు. ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్తుండగా.. అటుగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై యాసిడ్‌తో తెగబడ్డారు. యాసిడ్ దాడి జరగ్గానే బాలిక భరించలేని నొప్పితో పరుగులు తీసిన దృష్యం కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది.


ఈ యాసిడ్ దాడిపై ఢిల్లీ మహిళా చైర్ పర్సన్ స్వాతి మలివల్ ఘాటుగా స్పందించారు. యాసిడ్ అమ్మకాన్ని ఎందుకు నిలిపివేయకూడదు..ప్రభుత్వాలు ఇంకా ఎప్పుడు మేల్కొంటాయని ఆమె ఆవేదనతో ట్వీట్ చేశారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×