BigTV English

Delhi Crimes : ఢిల్లీలో కుటుంబ సభ్యులను దారుణంగా హత్యచేసిన కొడుకు..

Delhi Crimes : ఢిల్లీలో కుటుంబ సభ్యులను దారుణంగా హత్యచేసిన కొడుకు..

Delhi Crimes : దేశరాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఒకే కుటుంబంలోని నలుగురు కత్తిపోట్లతో దారుణ హత్యకు గురయ్యారు. కన్న కొడుకే కాలయముడై తన తండ్రి, తల్లి, అమ్మమ్మ, సోదరిని పొట్టనపెట్టుకున్నాడు.


తల్లిదండ్రుల మృతదేహాలు బాత్‌రూంలో పడి ఉండగా, సోదరి, అమ్మమ్మ మృతదేహాలు వారి బెడ్‌రూమ్‌లలో పడి ఉన్నాయి. హంతకుడు కేశవ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.

25 ఏళ్ల కేశవ్ అనే యువకుడు ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. మాదకద్రవ్యాలకు బానిస కావడం, గత దీపావళి నుంచి నిలకడైన సంపాదన లేకపోవడంతో ప్రతి రోజూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. కేశవ్ పదునైన ఆయుధంతో నలుగురు కుటుంబ సభ్యుల గొంతులు కోసి, పలుమార్లు కత్తితో పొడిచినట్టు పాలం పోలీసులు తెలిపారు. అతను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు గుర్తించారు. నిందితునిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×