E-Paper
Advertisement

Gokulpuri Metro Station: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై కుప్పకూలిన మెట్రో ప్లాట్ ఫారమ్..

Gokulpuri Metro Station: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై కుప్పకూలిన మెట్రో ప్లాట్ ఫారమ్..

Gokulpuri Metro Station in Delhi:ఢిల్లీ మెట్రో గోకుల్‌పురి స్టేషన్‌లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. గోకుల్‌పురి మెట్రో పింక్‌లైన్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌ సైడ్‌ వాల్‌లో కొంత భాగం కూలిపోయి రోడ్డుపై పడింది.

ఉదయం సమయం కావడంతో మెట్రో స్టేషన్ దిగువన వెళ్లే రోడ్డుపై జనం రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ప్లాట్ పారమ్ సైడ్ వాల్ కూలిపోవడంతో భయాందోళనకు గురి అయ్యారు. శిథిలాలలో ఒకరు చిక్కుకోగా, 3 నుంచి 4 మందికి గాయాలైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

ఘటనా సమయంలో స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నారు. కొందరి సహాయంతో పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను జీటీబీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను గుర్తించేందుకు చర్యలు చేపట్టి మరింత సమాచారం సేకరిస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగించారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని ఉత్తర ఢిల్లీ డీసీపీ తెలిపారు. అదే సమయంలో, ఈ ప్రమాదం తర్వాత, మెట్రో యొక్క కొత్త మార్గాలలో పింక్ రూట్ ఒకటి కాబట్టి నిర్మాణ పనుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×