E-Paper
Advertisement

Delhi Deepawali : ఈసారి దిల్లీలో టపాసులు అమ్మినా, కొన్నా, కాల్చినా అంతే సంగతులు…ప్రభుత్వం కీలక ఆదేశాలు

Delhi Deepawali : ఈసారి దిల్లీలో టపాసులు అమ్మినా, కొన్నా, కాల్చినా అంతే సంగతులు…ప్రభుత్వం కీలక ఆదేశాలు
Advertisement

Deepawali in Delhi :  ఏటా అక్టోబర్- నవంబర్ వస్తే చాలు. దేశమంతటా వాతావరణం ఒకలా ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం మరోలా ఉంటుంది. జాతీయ స్థాయిలోనే అత్యధిక స్థాయిలో పొల్యూషన్ ఉండే దిల్లీలో ఈసారి పండక్కి ముందే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.

దసరా పండుగ అయిపోయింది. ఇప్పుడు చిన్నా పెద్దా సహా అందరి దృష్టి దీపావళిపైనే ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో టపాసుల షాపులు జోరుగా అమ్మకాలు ప్రారంభించనున్నాయి.

Advertisement

అయితే ఊహించని రీతిలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. దీపావళికి టపాసులు ఎవరూ కాల్చొద్దని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అసలు టసాసుల షాపులు సైతం పెట్టొకూదంటూ ఆర్డర్స్ పాస్ చేసింది.

ఫలితంగా ఈ దీపావళిని కొవ్వొత్తులతో జరుపుకోవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. ఇదా ఎందుకు చేస్తుందని అనుకుంటున్నారా. నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కాస్త తగ్గించేందుకు దిల్లీ సర్కార్ కదిలింది.

Advertisement

సహజంగా దీపావళికి వారం రోజుల ముందు దిల్లీలో ఉండే వాతావరణ పరిస్థితులు ఈసారి 15 రోజుల ముందే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దిల్లీలో వాయి కాలుష్యం అక్టోబర్ 14 నాటికే విజృంభిస్తోంది.

ఇలాంటి సమయంలో దీపావళికి టపాసులు కాల్చితే అసలు దిల్లీ మహానగరం వ్యాప్తంగా పీల్చుకునేందుకు గాలే ఉండదు. అందుకే ఈసారి టపాకాయలు ఎవరూ కాల్చొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

2025, జనవరి ఒకటో తేదీ వరకు దిల్లీలో టపాసులు తయారు చేయటం, నిల్వ చేయటం, అమ్మటంపై నిషేధం విధించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లఘిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు. వాళ్లకు భారీ జరిమానా సైతం విధిస్తామని హెచ్చరించారు.

also read : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×