BigTV English
Advertisement

Delhi Liquor Scam Case Update: నిందితుల జాబితాలో ఆప్.. కోర్టుకు తెలిపిన ఈడీ..!

Delhi Liquor Scam Case Update: నిందితుల జాబితాలో ఆప్.. కోర్టుకు తెలిపిన ఈడీ..!

Update on Delhi Liquor Scam Case: ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని అత్యున్నత న్యాయస్థానానికి దర్యాప్తు సంస్థ ఈడీ శుక్రవారం పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు నేడు విచారించింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈరోజు ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేస్తున్నారని, ఆప్‌ను నిందితుడిగా చేశారని ఈడీ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.


ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పలో జరిగిన మనీలాండరింగ్ విషయంపై ఈడీ కేసు నమోదు చేసింది. పాత పాలసీని సవరించేటప్పుడు అనేక అవకతవకలు జరిగాయని.. లైసెన్స్ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారంటూ సీబీఐ, ఈడీ పేర్కొంది.

సౌత్ గ్రూప్ అందించిన రూ. 100 కోట్ల లంచంలో రూ. 45 కోట్ల “కిక్‌బ్యాక్”లను ఆప్ 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారని ఆరోపించింది దర్యాప్తు సంస్థ.


Also Read: 50 రోజుల తర్వాత.. జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రివాల్

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం 6 శాతం కిక్‌బ్యాక్‌ ఇచ్చే విధంగా వ్యాపారుల ప్రాఫిట్ మార్జిన్‌ను 12 శాతానికి పెంచిందని, దీని వలన ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2,873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది. అటు ఆప్ మీడియా హెడ్ విజయ్ నాయర్ పార్టీ తరపున ‘సౌత్ గ్రూప్’ నుంచి అడ్వాన్స్ గా రూ.100 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు.

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కె. కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 18 మందిని అరెస్టు చేశారు.

ఏప్రిల్ 10న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×