BigTV English
Advertisement

Arvind Kejriwal Arrest: కేజ్రీవాల్ ను అరెస్టు చేయించాలని కుట్ర.. ఢిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Arvind Kejriwal Arrest: కేజ్రీవాల్ ను అరెస్టు చేయించాలని కుట్ర.. ఢిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Arvind Kejriwal Arrest: బీజేపీ పై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇప్పించి, ఆయన్ను అరెస్టు చేయించాలని కుట్ర పన్నుతోందన్నారు. అందుకే సీబీఐ నోటీసులు సిద్దం చేస్తోందని వెల్లడించారు.


విపక్షాల ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసిన దగ్గరి నుంచి బీజేపీకి కంటిమీద కునుకు లేదని గోపాల్ రాయ్ అన్నారు. సీబీఐ ద్వారా నోటీసు ఇప్పించి, కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలని అధికార బీజేపీ ప్రణాళికలు రచిస్తుందన్నారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసు సిద్దం చేసినట్లు తెలిసిందన్నారు. ఈడీ నోటీసుల ద్వారా వాళ్ల పాచిక పారలేదన్నారు. ఇప్పుడు సీబీఐని దుర్వినియోగం చేసేందుకు బీజేపీ ప్లాన్ వేస్తుందన్నారు. దర్యాప్తు సంస్థలు ఆప్ నేతలతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి కానీ, అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారాన్ని కూడా గుర్తించలేకపోయాయన్నారు.

బీజేపీ బెదిరింపులకు ఆఫ్ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగంగానే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. తమను ఎవ్వరూ ఆపలేరన్నారు. ఆఫ్-కాంగ్రెస్ పొత్తుతో బీజేపీ భయపడుతోందని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.


Read More: వారణాసిలో పీఎం పర్యటన.. అర్థరాత్రి కొత్త రోడ్డును తనిఖీ చేసిన మోదీ..

రెండు పార్టీల మధ్య పొత్తు తుది దశకు చేరుకుందన్న వార్తలు మొదలుకాగానే.. ఈడీ నుంచి కేజ్రీవాల్ కు ఏడో నోటీసు వచ్చిందని గోపాల్ రాయ్ ఆరోపించారు. ఆఫ్ కాంగ్రెస్ మధ్య పొత్తు ఖాయమైతే.. కేజ్రీవాల్ అరెస్టు అవుతారని సందేశాలు వస్తున్నాయన్నారు. కావాలంటే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసుకోవచ్చు కానీ.. పొత్తు మాత్రం ఉంటుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకుంటే ఢిల్లీ వీధుల్లో ప్రజల సునామీ వస్తుందని సందీప్ పాథక్ వ్యాఖ్యలు చేశారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×