BigTV English

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృస్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు శబ్ధం వచ్చింది. ఈ పేలుడు ధాటికి స్కూల్ గోడతో పాటు సమీపంలో ఉన్న దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే కొన్ని వాహనాల అద్దాలు సైతం ధ్వంసమైనట్లు తెలుస్తోంది.


ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. పాఠశాలకు సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోరెన్సిక్ బృందాలతోపాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు పేలుడుకు గల కారణాలపై నిఘా పెట్టారు.

ఉదయాన్నే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు ఏం జరుగుతోందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందారు. మరికొంతమంది భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


Also Read: ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో ఉదయం 7.47 గంటలకు పేలుడు సంభవించిందని సీనియర్ పోలీస్ అధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఈ పేలుడుకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టేందుకు నిపుణులను పిలిపించామని తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలతోపాటు పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు దర్యాప్తు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని చెప్పారు. అలాగే డ్రెయినేజీ పైపు లైన్ పరిశీలించామన్నారు.

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×