BigTV English
Advertisement

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి.. భయాందోళనలో ప్రజలు

Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృస్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు శబ్ధం వచ్చింది. ఈ పేలుడు ధాటికి స్కూల్ గోడతో పాటు సమీపంలో ఉన్న దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే కొన్ని వాహనాల అద్దాలు సైతం ధ్వంసమైనట్లు తెలుస్తోంది.


ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. పాఠశాలకు సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోరెన్సిక్ బృందాలతోపాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు పేలుడుకు గల కారణాలపై నిఘా పెట్టారు.

ఉదయాన్నే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు ఏం జరుగుతోందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందారు. మరికొంతమంది భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


Also Read: ఝార్ఖండ్’లో బీజేపీ తొలి​ జాబితా విడుదల​, మాజీ సీఎం చంపయీ సోరెన్‌, సీఎం వదిన సీతా సోరెన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే ?

ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో ఉదయం 7.47 గంటలకు పేలుడు సంభవించిందని సీనియర్ పోలీస్ అధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఈ పేలుడుకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టేందుకు నిపుణులను పిలిపించామని తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలతోపాటు పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు దర్యాప్తు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని చెప్పారు. అలాగే డ్రెయినేజీ పైపు లైన్ పరిశీలించామన్నారు.

Related News

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Big Stories

×