E-Paper
Advertisement

Sabarimala: అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

Sabarimala: అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్
Advertisement

Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది. స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో భక్తుల రద్దీతో శబరిమల కిటకిటలాడుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

శబరిమలలో భక్తుల రద్దీతో ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కాలినడక వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో కొందరు స్వాములు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. మరోవైపు భక్తుల రద్దీతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శబరిమల సన్నిథానానికి వెళ్లే అటవీ మార్గం సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు పెంచింది. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు తరలిరావడంతో తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×