BigTV English

Sabarimala: అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

Sabarimala: అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది. స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో భక్తుల రద్దీతో శబరిమల కిటకిటలాడుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.


శబరిమలలో భక్తుల రద్దీతో ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కాలినడక వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో కొందరు స్వాములు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. మరోవైపు భక్తుల రద్దీతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శబరిమల సన్నిథానానికి వెళ్లే అటవీ మార్గం సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు పెంచింది. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు తరలిరావడంతో తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×