Sky Dining: ఆకాశంలో విందు.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. భోజనం.. కేరళలో స్కై డైనింగ్ పేరుతో నిర్వహించే అడ్వెంచర్ టూరిజం ఇది. అయితే, ఇలాంటి స్కై డైనింగ్ ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు రెస్టారెంట్లో క్రేన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆకాశంలోనే ఓ ఫ్యామిలీ చిక్కుకుపోయింది.
అడ్వెంచర్ స్కైడైనింగ్ పేరుతో ఆకాశంలో రెస్టారెంట్..
ఇడుక్కిలోని అనాచల్ సమీపంలో ఒక ప్రైవేట్ ‘స్కై-డైనింగ్’ రెస్టారెంట్ను ఎత్తివేసే క్రేన్ సడెన్గా మొరాయించింది. దీంతో ఇద్దరు పిల్లలు సహా నలుగురు పర్యాటకులు భూమి నుండి 150 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు.
రెండు గంటలకు పైగా నరకం చూసిన పర్యాటకులు..
మున్నార్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా గాలిలోని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చిక్కుకున్నవారు గడిపారు. అయితే, సమాచారం అందుకున్న ఫైర్, రెస్క్యూ సిబ్బంది సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాలిలో చిక్కుకుకన్న నలుగురు కుటుంబ సభ్యులను..
మున్నార్, ఆదిమాలి నుండి యూనిట్లను సహాయక బృంధాలు వచ్చాయి. రెస్క్యూ చేసి గాలిలోనే చిక్కుకుకన్న నలుగురు కుటుంబ సభ్యులను సురక్షితంగా రక్షించారు. తాత్కాలికంగా నిలిపివేయబడిన డైనింగ్ ప్లాట్ఫామ్ను చేరుకోవడానికి సిబ్బంది తాళ్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పర్యాటకులు కోజికోడ్కు చెందిన వారిగా గుర్తింపు..
క్రేన్లో చిక్కుకున్న కుటుంబం కోజికోడ్కు చెందిన్టుగా గుర్తించారు. క్రేన్ హైడ్రాలిక్స్ పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం. అడ్వెంచర్ టూరిజంలో భాగంగా కొండ జిల్లాలో స్కై-డైనింగ్ సెటప్ ఏర్పాటు చేశారు.
Tourists were stranded at a 120 feet sky dining centre in #Munnar Idukki area of #Kerala today after a crane developed a technical snag.
All the stranded people were rescued using ropes and wires.#skydining #Kerala #Tourist #Rescue #skyrestaurant #SkyHotel #Suffering pic.twitter.com/MkWiBD7wYi— Sujit Gupta (@sujitnewslive) November 28, 2025