E-Paper
Advertisement

Digital Census-2026: దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు, కులగణన కూడా

Digital Census-2026: దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు, కులగణన కూడా
Advertisement

Digital Census-2026: చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం. తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో జనాభా లెక్కింపును నిర్వహించనుంది. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నాలుగు అత్యాధునిక డిజిటల్‌ యాప్‌లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. దానితోపాటు పోర్టల్స్‌, మస్కట్‌లను లాంఛనంగా ఆవిష్కరించారు.

దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, అంతా రెడీ

Advertisement

అయితే జనాభా లెక్కింపు రెండు దశల్లో జరగనుంది. దీనితోపాటు కులగణన కూడా చేస్తోంది. జనగణన లెక్కింపు ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తోంది కేంద్రం. ఇళ్ల వివరాలు సేకరించే మొదటి దశ ఈ ఏడాది వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరగనుంది. అయితే రాష్ట్రాల వెసులుబాటు బట్టి నెల రోజులపాటు జరుగుతుంది. ఇక వ్యక్తుల వివరాలు సేకరించే రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా మొదలు కానుంది.

రెండో దశలో కులగణన వివరాలు సేకరిస్తారు. జనాభా లెక్కలకు 2027 మార్చి ఒకటి నుంచి నిర్ణయించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అంటే మంచు ప్రభావం ఉండే లడఖ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సర్వేను పూర్తి కానుంది.

Advertisement

ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు, కులగణన కూడా

జనాభా లెక్కల సేకరణకు దాదాపు 30 లక్షల మంది సిబ్బంది రంగంలోకి దిగనున్నారు. ఈసారి యాప్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌లో సిబ్బంది డేటాను సేకరించనుంది. ఈసారి ప్రజలకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ సౌకర్యాన్ని కల్పించింది కేంద్రం. ఎన్యుమరేటర్‌ ఇంటికి రాకపోయినా ప్రజలు తమ స్మార్ట్‌ ఫోన్ల ద్వారా చేసుకోవచ్చు.

16 ప్రాంతీయ భాషల్లో కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సదుపాయం ఉంది. ఆ తర్వాత వచ్చే ప్రత్యేక ఐడీని ఎన్యుమరేటర్‌‌కి చూపిస్తే సరిపోతుందని తెలిపింది. శాటిలైట్‌ మ్యాప్‌ల ద్వారా భౌగోళికంగా డిజిటల్‌ బ్లాక్‌ల రూపకల్పన, ఎన్యుమరేటర్లు నేరుగా డేటాను సర్వర్‌కు పంపేందుకు మొబైల్‌ యాప్‌ సహాయపడనుంది.

ALSO READ: అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. కొండలో భారీ పేలుడు శబ్దం

ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే వెబ్‌సైట్‌‌లో అధికారులంతా ఎప్పటికప్పుడు సర్వే పురోగతిని పర్యవేక్షించవచ్చు. జనగణన ప్రక్రియలో స్త్రీ-పురుషుల సమాన భాగస్వామ్యానికి ప్రతీకగా మహిళా ఎన్యుమరేటర్‌ను ప్రగతిగా, పురుష ఎన్యుమరేటర్‌ను వికాస్‌గా నామకరణం చేస్తూ మస్కట్‌లను విడుదల చేశారు హోంమంత్రి అమిత్ షా.

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×