E-Paper
Advertisement

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు
Advertisement

Rain Alert AP: నైరుతి రుతుపవనాల తిరోగమనంపై కీలక ప్రకటన చేసింది భారత వాతావరణ శాఖ. ఈ వారం చివరినాటికి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‎లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ. మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. దీని కారణంగా రానున్న రెండు రోజుల్లో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన

దేశ వ్యవసాయ రంగానికి జీవనాధారం రుతుపవనాలు. వాటి గురించి భారతీయ వాతావరణ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేసింది. కేరళ ద్వారా దేశంలోని నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వగా, రాజస్థాన్ నుంచి ఉపసంహరించుకుంటాయి.

ఈ వారం చివరినాటికి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ

Advertisement

నైరుతి రుతుపవనాల తిరోగమన నేపథ్యంలో రాజస్థాన్‎లో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. సెప్టెంబర్ 19 నుంచి వాతావరణం పొడిగా మారుతుందని పేర్కొంది. అదే సమయంలో మరొక కబురు చెప్పింది. తూర్పు-దక్షిణ భారతంలో పలు ప్రాంతాలలో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది.

బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు ఒడిశా- పశ్చిమబెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆ సమయంలో పిడుగులు, ఈదురుగాలుల ఉంటాయని పేర్కొంది.

Advertisement

ALSO READ: నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని, పొలాల్లో పనిచేసే రైతులు సురక్షిత ప్రాంతాల్లో వెళ్లాలని తెలియజేసింది. గడిచిన రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఊరట ఇచ్చాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న అంచనాతో రైతుల్లో ఆనందం మొదలైంది. జూన్ నెలలోనే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా ఎల్ నినో కారణంగా సరైన వర్షాలు పడలేదు. దీంతో అందరి దృష్టి బంగాళాఖాతం వైపు పడింది.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×