E-Paper
Advertisement

Uttar Pradesh: యూపీలో అమానవీయ ఘటన, మహిళను చెట్టుకు కట్టేసి..

Uttar Pradesh: యూపీలో అమానవీయ ఘటన, మహిళను చెట్టుకు కట్టేసి..

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. ప్రతాప్‌ గఢ్ జిల్లాలో‌ని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పంచాయితీ పెద్దలు అనాగరికంగా వ్యవహరించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేత సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఆమెను అందరూ చూస్తుండగానే అవమానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తర ప్రదేశ్‌లోని ఇబ్రహీంపూర్ గ్రామానికి  ఓ మహిళ భర్త బతుకు దెరువు కోసం ముంబైకి వెళ్లాడు. సదరు మహిళ అదే గ్రామంలో ఉంటూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గ్రామంలోని పంచాయితీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసకున్న పంచాయితీ పెద్దలు ముంబైలో ఉన్న ఆమె భర్తకు విషయాన్ని తెలియజేశారు. అంతే కాకుండా వెంటనే పంచాయితీకి రావాలని తెలిపారు.

భర్త, ముగ్గులు పిల్లల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన పెద్దలు ఆమె వివాహేతర సంబంధం నిజమేనని రుజువు చేశారు. అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి మెడలో చెప్పుల దండ వేసి ముఖానికి నల్ల రంగు పూసారు. అనంతరం ఆమె జుట్టును కూడా కత్తిరించారు. గ్రామస్థుల ముందే ఆమెను ఘోరంగా అవమానించారు. ఈ తతంగాన్ని గ్రామస్థుల్లోని ఒకరు వీడియో తీసారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. పంచాయితీ పెద్దలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×