E-Paper
Advertisement

India’s GDP: ఇండియా జీడీపీ గణాంకాలు విడుదల

India’s GDP: ఇండియా జీడీపీ గణాంకాలు విడుదల
Advertisement

The Economy grew 78 % in the March: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి. 2023-24 మార్చితో ముగిసిన మూడో త్రైమాసికంలో అంచనాలు మించి 7.8 శాతంగా జీడీపీ వృద్ధి నమోదు అయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 8.2 శాతంగా నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించి కేంద్ర గణాంక కార్యాలయం వివరాలను వెల్లడించింది.

డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికం 8.6 శాతంతో పోలిస్తే ఇది కాస్త తక్కువే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.02 శాతంగా నమోదు అయ్యింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7 శాతం వృద్ధి చెందింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండోసారి ఎన్ఎస్ఓ వెలువరించిన అంచనాల్లో 7.7 శాతం వృద్ధి నమోదు కావచ్చని కేంద్ర గణాంక కార్యాలయం పేర్కొంది.

Advertisement

అయితే, అంతకుమించి జీడీపీ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ సంవత్సరం తొలి మూడు నెలల్లో పొరుగు దేశమైన చైనా 5.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశానికి సంబంధించిన సంవత్సర ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటు అంటారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63గా నమోదు అయ్యింది. అయితే, వాస్తవానికి బడ్జెట్ లో 5.8 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు.

Also Read: సాఫ్టుగా ఉంటే అంతే! ఐటీ ఉద్యోగ కష్టాలు

Advertisement

వాస్తవ రూపంలో చూసినప్పుడు మాత్రం ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం రూ. 16.53 లక్షల కోట్లు అని అధికార గణాంకాలు చెబుతున్నాయి. కాగా, స్థూలంగా పన్నుల రూపంలో రూ. 23.26 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాగా, వ్యయం రూ. 44.42 లక్షల కోట్లుగా ఉంది.

Tags

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×