Jammu Kashmir: జమ్ము కశ్మీర్ కిష్త్వార్ లోని చత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. చత్రూ ప్రాంతంలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు నక్కి వున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్న భద్రత బలగాలు అనుమానించాయి. జమ్మూ కశ్మీర్ ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా చేసేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కిష్త్వార్ ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై… పై చేయి సాధించాయి. భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాయి. చత్రూలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్కు చెందిన ఇద్దరు అగ్ర ఉగ్రవాద కమాండర్లను హతం అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున భారత సైన్యం జరిపిన కాల్పుల్లో జైషే మొహమ్మద్ కమాండర్ ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులకు భారీ ఆపరేషన్ విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గత 15 రోజులుగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.