E-Paper
Advertisement

Suicide in Kota : ‘అమ్మా నాన్నా.. క్షమించండి’.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

Suicide in Kota : రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నమరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాను చదవలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటా (Kota) లో విద్యార్థుల ఆత్మహత్య (Suicide)లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తాను ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Suicide in Kota : ‘అమ్మా నాన్నా.. క్షమించండి’.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..
Advertisement

Suicide in Kota : రాజస్థాన్‌ రాష్టం కోటాలో జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నమరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాను చదవలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటా (Kota) లో విద్యార్థుల ఆత్మహత్య (Suicide)లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తాను ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కోటాకు చెందిన ఆ బాలిక 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఓ కోచింగ్‌ సెంటర్‌లో జేఈఈకి శిక్షణ తీసుకుంటున్నారు. సోమవారం తన ఇంట్లో తల్లదండ్రులకు సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు.

Advertisement

“అమ్మా, నాన్న నేను జేఈఈ చదవలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను నేను ఓడిపోయాను నన్ను క్షమించండి’’ అని అందులో రాసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 31న పరీక్ష రాయాల్సి ఉండగా.. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

కోటాలో ఈ ఏడాది చోటుచేసుకున్న రెండో ఘటన ఇది. జనవరి 23న ఒక ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో నీట్‌కు శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత సంవత్సరం కూడా ఇక్కడ విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Advertisement

దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా శిక్షణ ఇవ్వాలని సూచించింది. అటు విద్యార్థుల మరణాలను నియంత్రించేందుకు భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ ఫ్యాన్లను అమర్చారు. అయినప్పటికీ ఇవి ఆగకపోవడం కలవరపెడుతోంది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×