E-Paper
Advertisement

KC Venugopal Comments: మోదీ ప్రభుత్వంపై కేసీ వేణుగోపాల్ ఫైర్.. నా ఫోన్లో స్పైవేర్ అంటూ..!!

KC Venugopal Comments: మోదీ ప్రభుత్వంపై కేసీ వేణుగోపాల్ ఫైర్.. నా ఫోన్లో స్పైవేర్ అంటూ..!!
Advertisement

KC Venugopal Comments on Modi’s Government: కేంద్రంలోని మోదీ సర్కార్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిందా..? ముమ్మాటి కీ అవుననే అంటున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ క్రమంలో కీలక విషయాలను వెల్లడించారాయన. మోదీ సర్కార్ తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించారు. ఆ తరహా చర్యలను తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ యాపిల్ ఫోన్‌కు ఆ కంపెనీ నుంచి వార్నింగ్ మెసేజ్ వచ్చింది. మీ యాపిల్ ఐడీతో ఉన్న ఫోన్‌ను హ్యాక్ చేసేందుకు స్పైవేర్‌తో ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో కి కీలక సారాంశం. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లు భావిస్తున్నామని అందులో ఉంది.

Advertisement

ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ రియాక్ట్ అయ్యారు. ఇది ముమ్మాటికీ మోదీ సర్కార్ పనేనని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా రియాక్టు అయ్యారు. థ్యాంక్యూ మోదీజీ.. మీకెంతో ఇష్టమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కు పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారాయన. మీరు పంపిన స్పెషల్ గిఫ్ట్ గురించి యాపిల్ సంస్థ తనకు సమాచారం ఇచ్చిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు వారి గోప్యతకు భంగం కలిగించేందుకు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: విందులో నాన్‌వెజ్ లేదని పెళ్లి క్యాన్సిల్

Advertisement

వేణుగోపాల్ ఫోన్‌కు యాపిల్ కంపెనీ నుంచి మెసేజ్ రావడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబరు 30న వార్నింగ్ వచ్చిందన్నారు. ఇది రిపీట్ నోటీసు కాదన్నారు. ప్రస్తుతం వచ్చింది తన ఫోన్ మీద ఎటాక్‌గా వర్ణించారు. మొబైల్ ఫోన్లపై దాడి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. 2021 నుంచి వినియోగదారులకు యాపిల్ కంపెనీ అలర్ట్ మేసెజ్‌లను పంపిస్తుంది. ప్రస్తుతం వేణుగోపాల్ ఫోన్‌కు వచ్చిన వార్నింగ్.. ప్రభుత్వం పనా? లేక హ్యాకర్స్ పనా అనేది తెలియాల్సివుంది.

Tags

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×