E-Paper
Advertisement

No fish on Menu – No Wedding: మీ దుంపల్ తెగ.. విందులో నాన్‌వెజ్ లేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘనులు!

No fish on Menu – No Wedding: మీ దుంపల్ తెగ.. విందులో నాన్‌వెజ్ లేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘనులు!

Wedding Cancelled Due to No Fins in Menu: అసలే అమ్మాయిలు దొరక్క చాలా మంది పెళ్లిళ్లు ఆలస్యంగా చేసు కుంటున్నారు. చాలా కమ్యూనిటీల్లో ఇదే సమస్య వెంటాడుతోంది. మరికొందరు కులాంతర విహహాలు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైంది. కొంతమంది బడాబాబులైతే దగ్గర బంధువు లతో వియ్యమందుకుంటున్నారు. యూపీలోని ఓ ఫ్యామిలీ అందుకు డిఫరెంట్. విందు భోజనంలో నాన్ వెజ్ లేదని ఏకంగా పెళ్లిని రద్దు చేసుకుంది వరుడి కుంటుంబం.

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా ఆనంద్‌నగర్ గ్రామంలో గురువారం మ్యారేజ్ జరగనుంది. దినేష్‌శర్మ కూతురు సుష్మను మ్యారేజ్ చేసుకునేందుకు ఆనంద్‌నగర్ గ్రామానికి చెందిన అభిషేక్‌శర్మ కుటుంబ సభ్యులు అంగీకరించారు. కాబోయే అల్లుడికి కట్నంగా ఐదు లక్షలు ఇవ్వడమేకాదు, కారు కొనుగోలు చేసేందుకు మరో నాలుగున్నర లక్షలు, రెండు బంగారం ఉంగరాలు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే జరిగింది.

వధువు ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు. గురువారం రాత్రి పెళ్లి జరగాల్సివుంది. అయితే విందులో పన్నీర్ పలావ్, రకరకాల కూరలతో భారీగా ఏర్పాటు చేశారు. అందరు చెప్పుకునే రీతిలో చేశారు. విందులో చేపలు, మాంసం లేకపోవడంతో వరుడి ఫ్యామిలీ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని వధువు ఫ్యామిలీ సభ్యులను పిలిచి గట్టిగా అడిగారు. ఈ క్రమంలో వియ్యంకుల మధ్య మాటలు కాస్త వివాదంగా మారాయి. చివరకు విందు సమయంలో కర్రలు కుర్చీలతో కొట్టుకున్నారు. దాదాపు ఆరుగురు గాయపడ్డారు.

Also Read: డేంజర్ జోన్ లో మోదీ సర్కార్..కొంప ముంచిన ఉప ఎన్నికలు

అంత జరిగిన తర్వాత సెలైంట్‌గా ఉంటారా? మ్యారేజ్‌ను రద్దు చేసుకున్నట్లు వరుడు కుటుంబసభ్యులు ప్రకటించారు. దీంతో వధువు ఫ్యామిలీ షాకయ్యింది. కేవలం నాన్ వెజ్ లేదనే కారణంతో పెళ్లిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అమ్మాయి తరపువాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం కింద అల్లుడికి ఐదు లక్షలు, కారు కొనుక్కోనేందుకు మరో నాలుగున్నర లక్షలు అంతా చూస్తూ.. దాదాపు 20 లక్షల వరకు ముట్టజెప్పామని ఫిర్యాదులో ప్రస్తావించారు. పోలీసులు ఇరు కుటుంబాల మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×