BigTV English

Kedarnath Temple: కేదార్‌నాథ్ గుడిలో 125 కోట్ల గోల్డ్ స్కామ్.. పూజారి ఆరోపణలతో కలకలం..

Kedarnath Temple: కేదార్‌నాథ్ గుడిలో 125 కోట్ల గోల్డ్ స్కామ్.. పూజారి ఆరోపణలతో కలకలం..
KEDARNATH GOLD

Kedarnath Temple: ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్‌ ఆలయంలో అవినీతి కలకలం రేపుతోంది. దేవాలయంలోని గోడలకు స్వర్ణతాపడంలో 125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సంచలన ఆరోపణలు చేశారు.


మహారాష్ట్రకు చెందిన ఓ దాత గర్భగుడిలో స్వర్ణ పలకల తాపడం చేయించారు. అయితే ఆలయ గర్భగుడిలో గోడలను బంగారు రేకులతో కప్పతున్నట్లు చెప్పి, ఇత్తడి పలకలు వాడారని తీవ్ర ఆరోపణలు చేశారు. తీర్థ్ పురోహిత్ మహా పంచాయత్ కు ఉపాధ్యక్షుడిగానూ ఉన్న సంతోష్ త్రివేది ఈ కుంభకోణంలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన దిగుతామని హెచ్చరించారు.

బంగారు తాపడం చేయడం సంప్రదాయానికి విరుద్దమని.. ఆలయ నిర్వహణ కమిటీలోనే ఎంతోమంది దీన్ని వ్యతిరేకించారని అన్నారు. బంగారం నాణ్యతపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


అయితే ఈ ఆరోపణల్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ కుట్రలో ఈ ప్రచారం సాగుతోందని ఆరోపించింది. బంగారు తాపడం పనులను ఆర్కియాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. పనులన్నీ దాత చేతుల మీదుగానే జరుగుతున్నాయని.. అందులో ఆలయ కమిటీకి ఎటువంటి జోక్యం లేదని స్పష్టం చేసింది. గతంలో బద్రీనాథ్‌ ఆలయానికి బంగారు తాపడాన్ని చేయించిన దాతే ప్రస్తుతం దీన్ని తయారుచేయిస్తున్నారని తెలిపింది. కేదార్‌నాథ్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆలయ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×