BigTV English
Advertisement

BJP Formation Day : మళ్లీ మాదే అధికారం.. కాంగ్రెస్ పతనం ప్రారంభం : కిషన్ రెడ్డి

BJP Formation Day : మళ్లీ మాదే అధికారం.. కాంగ్రెస్ పతనం ప్రారంభం : కిషన్ రెడ్డి


Kishan Reddy Speech in BJP Formation Day 2024(Today’s State News) : మే 13న తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 10కి పైగా ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లలో గెలిచి.. మళ్లీ కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం


రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, రోజురోజుకూ కనుమరుగవుతోందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని జోస్యం చెప్పారు. ప్రపంచ నాయకుడిగా ప్రధాని నరేంద్రమోదీ గుర్తింపు పొందారని కొనియాడారు. ఇప్పుడు యావత్ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణకు రాహుల్ గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయలేదని, అలాంటపుడు రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా.. పెద్ద పెద్ద ప్రకటనలు, సభలు మాత్రం పెడుతున్నారని దుయ్యబట్టారు.

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×