E-Paper
Advertisement

Land Scam Case: ముడా ఆఫీసులో ఈడీ సోదాలు.. సీఎం సిద్దరామయ్యకు చిక్కులు తప్పవా?

Land Scam Case: ముడా ఆఫీసులో ఈడీ సోదాలు.. సీఎం సిద్దరామయ్యకు చిక్కులు తప్పవా?
Advertisement

Land Scam Case: ముడా కుంభకోణంలో ఏం జరుగుతోంది? ఛైర్మన్ రాజీనామా చేసిన రెండురోజులకే ఈడీ రంగంలోకి దిగిందా? సోదాల వెనుక ఏం జరుగుతోంది? కమిషనర్‌తో ఈడీ అధికారులు ఏం మాట్లాడారు? ఇలా రకరకాల ప్రశ్నలు కన్నడ వాసులను వెంటాడుతోంది.

కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ ముడా కుంభకోణంపై ఈడీ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లేటెస్ట్‌గా మైసూర్ నగరాభివృద్ధి సంస్థలో ఈడీ సోదాలు చేయడం కలకం రేపుతోంది.

Advertisement

శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆఫీసుకు చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు చేశారు. తొలుత ముడా కమిషనర్ రఘనందన్ సహా ఇతర అధికారులతో మాట్లాడారు. లభించిన పత్రాల ఆధారంగా సిబ్బందిని విచారించే అవకాశమున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో సీఎం సిద్ధరామయ్యకు కష్టాలు తప్పవని అంటున్నారు.

రెండు రోజుల కిందట ముడా అథారిటీ ఛైర్మన్ మరిగౌడ్ రాజీనామా చేశారు. కాకపోతే అనారోగ్యం కారణంగా రిజైన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్యకు మరిగౌడ అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. అయితే ఈ స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యతోపాటు మరిగౌడ ప్రమేయమున్నట్లు ఓ వైపు కర్ణాటకలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Advertisement

ALSO READ:  కల్తీ మద్యం తాగి 43 మంది మృతి.. విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు

మరోవైపు ముడా భూముల కుంభకోణంలో  కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య భార్య ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములను ముడాకు తిరిగి ఇచ్చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కన్నడ రాజకీయ నేతలు సీఎం సిద్దరామయ్యకు కష్టాలు తప్పవని అంటున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×