E-Paper
Advertisement

LK Advani : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. ఆ ఇద్దరు నేతలకు ఎట్టకేలకు ఆహ్వానం..

LK Advani :  అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం..  ఆ ఇద్దరు నేతలకు ఎట్టకేలకు ఆహ్వానం..
lk advani
lk advani

LK Advani: అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. రామ మందిరం ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఎల్ కే ఆడ్వానీ(96), మురళీ మనోహర్ జోషి(89) ఇద్దరు నేతలను విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు అలోక్ కుమార్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. వచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆ ఇద్దరు నేతలు చెప్పినట్లు సమాచారం.

అంతకుముందు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ వేడుకలకు ఇద్దరు సీనియర్ నాయకులు రాకపోవడం మంచిదని రామ మందిర ట్రస్ట్ సభ్యులు సోమవారం విన్నవించారు. ”మా వినతిని వారిద్దరూ స్వీకరించారు.. ఆలయ వేడుకలకు హాజరుకావడం లేదు” అని ట్రస్టు ప్రధాన కార్యదర్మి చంపత్ రాయ్ విలేకరులకు వెల్లడించారు. ఆయన ప్రకటనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆడ్వానీ, మురళీ మనోహర్ జోషిని ఆహ్వానించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ప్రధానమంత్రి దేవగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని ట్రస్టు సభ్యులు తెలిపారు. జనవరి 23 నుంచి అయోధ్య రామమందిరంలోకి సాధారణ భక్తులను అనుమితిస్తారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×