Lost Phone Bag In Train: దేశంలో ప్రతిరోజూ రెండు కోట్లకు పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దిగే తొందరలో లగేజీ పోగొట్టుకోవడం రైలు ప్రయాణాల్లో సర్వసాధారణం. పర్సులు, బ్యాక్ప్యాక్లు, ఫోన్లు ఇలా చాలా వస్తువులు రైళ్లలో మర్చిపోతుంటారు లేదా పోగొట్టుకుంటారు. రైళ్లలో లగేజీ, ఫోన్లు మర్చిపోయినా, పోగొట్టుకున్నా.. ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువుల గురించి ఫిర్యాదు చేసేందుకు రైల్వే శాఖ ‘రైల్ మదద్’ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది. 24×7 అందుబాటులో ఉండే ఈ డిజిటల్ సర్వీస్ లో.. ప్రయాణికులు నేరుగా తమ ఫోన్ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. తమ PNR నంబర్ను ఎంటర్ చేసి, పోగొట్టుకున్న సామాను ఫిర్యాదు చేయాలి. దీంతో రైలు మార్గంలోని సంబంధిత రైల్వే డివిజన్లను అధికారులు తక్షణమే అప్రమత్తం చేస్తారు. లేదా అధికారిక వెబ్సైట్ railmadad.indianrailways.gov.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే.. అంత వేగంగా గాలింపు చేసి వస్తువులు తిరిగి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తారు.
ఒకవేళ ప్రయాణికుల వద్ద ఫోన్ లేకపోతే.. తాము దిగిన స్టేషన్లో లేదా నెక్ట్స్ మెయిన్ స్టేషన్ ఫిర్యాదు చేయవచ్చు. స్టేషన్ మాస్టర్లు, పోగొట్టుకున్న వస్తువుల కౌంటర్లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఈ తరహా ఫిర్యాదులు స్వీకరిస్తారు. తమ వస్తువులు దొరక్కపోతే.. RPF పోలీసుల వద్ద FIR నమోదు చేయాల్సి ఉంటుంది. రైల్ మదద్ యాప్ లో ప్లాట్ఫామ్, టికెటింగ్, క్లీనింగ్ ఇలా రైలులోని సౌకర్యాలు, భద్రతపై ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు.
ఇలా చేస్తే మీ ఫోన్ డేటా సేఫ్ గా ఉంటుంది. దొంగలు మీ ఫోన్ ను వాడలేరు. ఫోన్ తిరిగి దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.