E-Paper
Advertisement

Maharashtra Politics: శరద్‌పవార్‌కు షాక్.. అజిత్‌పవార్ వర్గానికి ఎన్సీపీ గుర్తు కేటాయింపు..

Maharashtra Politics: కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్‌కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయించింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపి వర్గంగా గుర్తింపు ఇచ్చింది. పార్టీ గుర్తు గడియారంని అజిత్ పవార్‌కు కేటాయించింది.

Maharashtra Politics: శరద్‌పవార్‌కు షాక్.. అజిత్‌పవార్ వర్గానికి ఎన్సీపీ గుర్తు కేటాయింపు..
Maharashtra Politics

Maharashtra Politics (latest today news in india):

కేంద్ర ఎన్నికల సంఘం శరద్‌పవార్‌కు షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయించింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీ వర్గంగా ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది. పార్టీ గుర్తు గడియారంని అజిత్ పవార్‌కు కేటాయించింది.

ఈ వార్త అజిత్‌ పవార్‌ వర్గానికి అతిపెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. కొత్త గుర్తు కోసం శరద్ పవార్ గ్రూపు కొత్తగా ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది. దీనికి రేపు 4 గంటల వరకే ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. గతంలో ఎన్నికల సంఘం ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి షాకిచ్చింది. తాజాగా కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పుడు శరద్‌పవార్‌కు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చింది.

గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బిజేపీ- షిండే సర్కారుకు మద్దతు పలికారు అజిత్‌ పవార్‌. తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ ఎవరిదనే దానిపై శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ మధ్య వివాదం కొనసాగుతూ వచ్చింది. ఎన్సీపీలో మొత్తం 53మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అజత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోయారు. ప్రస్తుతం శరద్ పవార్‌కు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×