E-Paper
Advertisement

Modi Govt: భారం పడకుండా.. కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

Modi Govt: భారం పడకుండా.. కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు
Advertisement

Modi Govt: పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై ఇప్పటివరకు అదనంగా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్ పై 3 రూపాయలు, డీజిల్‌పై ఉన్న 10 రూపాయలు సుంకాన్ని సున్నాకు తగ్గించినట్లు పేర్కొంది. దీంతో మార్కెట్లో ధరలు తగ్గనున్నాయి.

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెల‌కొంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పుడు విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించింది. అలాగే డీజిల్‌పై రూ.10 ని పూర్తిగా తొలగించిందని తెలిపింది.

కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయిల్ కంపెనీలకు బిగ్ రిలీఫ్. మార్కెట్లో HPCL, IOCL, BPCL కంపెనీల షేర్లు భారీగా లాభపడే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఆయిల్ కంపెనీలకు కలిసి రానుంది.

Advertisement

కేంద్రం నిర్ణయంతో ఆయిల్ కంపెనీలకు స్మాల్ రిలీఫ్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరుగుతాయనే భయాలు మార్కెట్లో నెలకొన్నాయి. దీనికితోడు హర్మూజ్‌ జలసంధి దాదాపు మూతపడటంతో చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.  ఫలితంగా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచలేదు. అమ్మకాలపై భారీ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇరాన్‌ లో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమన్నాయి. ట్రేడింగ్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర మళ్లీ 100 డాలర్లు దాటింది. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఆయా కంపెనీలు ధరలు పెంచలేదు. లీటర్‌ పెట్రోల్‌/డీజిల్‌పై దాదాపు రూ.48 వరకు నష్టపోతున్నట్లు ఆయా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ALSO READ:  కొత్త వివాదంలో ఓ మంత్రి.. ట్రాన్స్‌‌జెండర్‌తో రాసలీలలు, మంత్రి రాజీనామాకు డిమాండ్ 

రష్యన్ కంపెనీ రోస్నెఫ్ట్-కేసాని ఎంటర్‌ప్రైజెస్ మద్దతుతో దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను గురువారం పెంచింది. పెట్రోల్-డీజిల్ ధరలను లీటరుకు వరుసగా రూ. 5 నుంచి రూ. 3 వరకు పెంచిన విషయం తెల్సిందే.

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×