E-Paper
Advertisement

Ayodhya : 14 లక్షల దీపాలతో శ్రీరాముని పరాక్రమరూపం.. అయోధ్యలో బీహార్ కళాకారుల కళాఖండం

Ayodhya : 14 లక్షల దీపాలతో శ్రీరాముని పరాక్రమరూపం.. అయోధ్యలో బీహార్ కళాకారుల కళాఖండం

Ayodhya : అయోధ్య రామమందిరం.. కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష. జనవరి 22న రామమందిరం ప్రారంభం, బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో కోట్లాది మంది ఆకాంక్ష తీరనుంది. ప్రధాని నరేంద్రమోదీ రామ్ లల్లా విగ్రహాన్ని ఆరోజున ప్రతిష్ఠించనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లతో అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది. బీహార్ కు చెందిన కళాకారులు అయోధ్యలో అద్భుతమైన కళాకృతిని తీర్చిదిద్దారు. 14 లక్షల దీపాలతో రాముడి ఆకృతిని రూపొందించారు. 14 లక్షల దీపాలతో.. బీహార్ మొజాయిక్ కళాకారులు అనిల్ కుమార్ తన సహ ఉద్యోగులతో కలిసి ఈ కళాఖండాన్ని తీర్చిదిదద్దదారు.

శనివారం కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే అయోధ్యకు విచ్చేసి.. ఈ కళాఖండాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోధ్యలో బీహార్ కళాకారుల బృందం ఏడురోజుల పాటు శ్రమించి.. 14 లక్షల దీపాలతో పరాక్రమవంతుడైన శ్రీరాముడి ఆకృతిని తీర్చిదిద్దారని తెలిపారు. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాతం.. అయోధ్యకు తిరిగివచ్చిన శ్రీరాముడి రూపం.. నవ భారత యువకుల్లో శౌర్యం ఉండాలన్న సందేశాన్నిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆర్ట్ వర్క్ లో ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే జై శ్రీరామ్ అనే ఆకృతిని కూడా రూపొందించారు.

.

.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×