BigTV English

Nirmala Sitharaman: వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరోమంత్రిగా.. నిర్మలమ్మ

Nirmala Sitharaman: వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరోమంత్రిగా.. నిర్మలమ్మ

Nirmala Sitharaman: 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిర్మలా సీతారమన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఈక్రమంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరో ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ నిలిచారు. అంతకంటే ముందు అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా, పి.చిదంబరం, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


దేశ చరిత్రలోనే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా.. 1959-60 నుంచి 1963-64 మధ్యలో వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఆ తర్వాత మన్మోహన్ సింగ్ 1991-92 నుంచి 1995-96 వరకు ఐదు పద్దులు పార్లమెంట్ ముందు ఉంచారు. ఇక 1998-99 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన యశ్వంత్ సిన్హా.. 1999-2000 నుంచి 2002-03 వరకు వరుసగా నాలుగుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


పి.చిదంబరం 2004-2005 నుంచి 2008-2009 వరకు ఐదుసార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ఉంచారు. ఇక మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుంచారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×