ATM Theft: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా తురిగడియా మార్కెట్ ప్రాంతం శుక్రవారం రాత్రి ఒక హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు వేదికైంది. సాధారణంగా దొంగలు తాళాలు పగలగొట్టడమో, లేదా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కట్ చేయడమో మనం చూస్తుంటాం. కానీ ఇక్కడి దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి వేళ నిర్మానుష్యంగా ఉన్న ‘ఇండియా వన్’ ఏటీఎం సెంటర్ను టార్గెట్ చేసిన దుండగులు.. ఒక పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. టెక్నాలజీని వాడకుండా కేవలం శారీరక బలాన్ని, ఒక శక్తివంతమైన వాహనాన్ని నమ్ముకుని వారు చేసిన పని ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
రోడ్డుపై 200 మీటర్లు ఈడ్చుకెళ్లారు..
ఈ దోపిడీకి దొంగలు ఎంచుకున్న వాహనం ‘మహీంద్రా థార్’ ఎస్యూవీ. కారు దిగిన దుండగులు ఏటీఎం కియోస్క్లోకి చొరబడి, బలమైన ఇనుప గొలుసు లేదా తాడు సహాయంతో ఏటీఎం మిషన్ను థార్ కారు వెనుక భాగానికి గట్టిగా కట్టేశారు. ఆ తర్వాత కారును ఒక్కసారిగా ముందుకు పోనివ్వడంతో, ఆ పవర్కు ఏటీఎం మిషన్ పునాదులతో సహా ఊడి బయటకు వచ్చేసింది. అంతటితో ఆగకుండా, ఆ మిషన్ను రోడ్డుపై దాదాపు 200 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో మిషన్ను పగలగొట్టి, అందులోని భారీ నగదును దోచుకుని క్షణాల వ్యవధిలో అక్కడి నుంచి పరారయ్యారు.
‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ వెబ్ సిరీస్ స్ఫూర్తితోనేనా?
ఈ విచిత్రమైన దొంగతనం తీరు చూస్తుంటే పాపులర్ వెబ్ సిరీస్ ‘Pritam and Pedro’ లోని ఒక కీలకమైన సీన్ గుర్తుకు రాక మానదు. ఆ సిరీస్లో కూడా సరిగ్గా ఇలాగే వాహనానికి ఏటీఎంను కట్టి లాగేసే సీన్ ఉంటుంది. దొంగలు ఈ వెబ్ సిరీస్ను నిశితంగా గమనించి, అందులోని ఐడియాను సేమ్ టు సేమ్ రియల్ లైఫ్లో రీక్రియేట్ చేసినట్లు స్పష్టమవుతోంది. రీల్ లైఫ్ దొంగతనాన్ని రియల్ లైఫ్లో అప్లై చేసి, పోలీసులకే సవాల్ విసిరేలా ప్లాన్ అమలు చేయడం గమనార్హం.
రంగంలోకి పోలీసులు.. సీసీటీవీల వేట
శనివారం ఉదయం ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలాసోర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏటీఎం పరిసరాల్లో ఉన్న CCTV ఫుటేజీలను, అలాగే ఆ మార్గంలోని టోల్ గేట్లు, హైవే కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితులు వాడిన థార్ కారు ఎవరిది? వారు ఎటువైపు పారిపోయారు? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సినిమా స్టైల్ ఐడియాతో సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
Also Read: నేను చనిపోయి ఐదేళ్లయింది… కానీ ఇంకా బ్రతికే ఉన్నాను! ఒక అంతుచిక్కని మైండ్-బెండింగ్ మిస్టరీ
ATMను థార్ కారుకు కట్టి.. ఆపై..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా తురిగడియా మార్కెట్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఇండియా వన్ ATMను దోచుకున్నారు. నిందితులు మహీంద్రా థార్ ఎస్యూవీ కారు సహాయంతో ఏటీఎం మిషన్ను కియోస్క్ నుండి బయటకు లాగి, దాదాపు 200 మీటర్ల దూరం రోడ్డుపై… pic.twitter.com/8SBCJEfwnm
— ChotaNews App (@ChotaNewsApp) July 11, 2026