E-Paper
Advertisement

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ విడత.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్..

PM Kisan 17th Installment: పీఎం కిసాన్ 17వ విడత.. నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్..
Advertisement

PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 17వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూన్ 18న ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ. 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్వవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.

పీఎం కిసాన్ పథకం 17వ విడత విడుదలైన తర్వాత కృషి శాఖలుగా గుర్తింపు పొందిన 30 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలకు ప్రధాని మోదీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

కేంద్ర వ్వవసాయ, రైతు సంక్షేమ శాఖ, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వ్యవసాయ మంత్రి చౌహాన్ పేర్కొన్నారు.

Advertisement

అదనంగా, రైతులకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని ఆయన స్పష్టం చేశారు. తనకు ప్రధాని మోదీ వంద రోజుల ప్రణాలికతో కూడిన బాధ్యతలను ఇచ్చారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

జూన్ 10న మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధి పథకం 17వ విడత నిధులు విడుదలపై తొలి సంతకాన్ని చేశారు. దీంతో ఈ పథకం ద్వారా మొత్తం 903 కోట్ల రైతులకు లబ్ది చేకూరుతుంది.

Also Read: స్పీకర్ రేస్ నుంచి జేడీయూ అవుట్..! టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ..

2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా సంవత్సరానికి 6 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది. మొత్తం మూడు సమాన వాయిదాల్లో అంటే ప్రతి వాయిదాకు రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తుంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×