E-Paper
Advertisement

Lok Sabha Speaker: స్పీకర్ రేస్ నుంచి జేడీయూ అవుట్..! టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ..

Lok Sabha Speaker: స్పీకర్ రేస్ నుంచి జేడీయూ అవుట్..! టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ..
Advertisement

Lok Sabha Speaker: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రి పదవులిచ్చి మిత్రపక్షాలలో అసంతృప్తులు లేకుండా బీజేపీ జాగ్రత్తపడింది. కానీ లోక్ సభ స్పీకర్ పదవిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ తమకు స్పీకర్ పదవి కేటాయించాలని పట్టుబట్టింది. ఇక తామేం తక్కువకాదన్నట్టు జేడీయూ కూడా స్పీకర్ పదవిపై కన్నేసింది.

బీజేపీకి తలనొప్పులు తప్పవు అనుకునే సమయానికి జేడీయూ స్పీకర్ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం జేడీయూ స్పోక్స్ పర్సన్ కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలే. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసిన వ్యక్తికి తాము మద్దతు ఇస్తామని కేసీ త్యాగి చెప్పారు. దీంతో స్పీకర్ రేసు నుంచి జేడీయూ అవుట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

లోక్‌సభ స్పీకర్‌పై జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మాట్లాడుతూ.. “టీడీపీ, జేడీయూ ఎన్డీఏతో ఉన్నాయి. బీజేపీ నామినేట్ చేసిన వారికి మద్దతిస్తాం..’’ అని అన్నారు. ఓ ఇంటర్వూలో స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి కట్టబెడతారా అనే ప్రశ్నకు త్యాగి జవాబిచ్చారు. స్పీకర్ పదవి ఎప్పుడూ పాలక పక్షానిదేనని.. వారికి ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి వారికి కట్టబెట్టడమే కరెక్ట్ అని త్యాగి అన్నారు.

Advertisement

ఇదిలా ఉండగా టీడీపీ మాత్రం స్పీకర్ పదవిపై పట్టువిడవడం లేదని తెలుస్తోంది. కేంద్రంలో చక్రం తిప్పాలంటే స్పీకర్ పదవి చాలా కీలకం మని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం బాబుకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. అందుకు ఉదాహరణ 1999 కేంద్రంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ఓటింగ్.. అప్పటి ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి టీడీపీ స్పీకర్ జీఎంసీ బాలయోగీ తీసుకున్న నిర్ణయమేనంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: వాజ్‌పేయ్ గవర్నమెంట్ పడిపోడానికి కారణమేంటో తెలుసా..? మరోసారి మోదీ ఆ సాహసం చేస్తారా?

దీంతో బీజేపీ ప్రస్తుతం స్పీకర్ పదవిని టీడీపీకి ఇచ్చేందుకు సాహసం చేయడంలేదని చర్చ నడుస్తోంది. దీంతో స్పీకర్ పోరులో టీడీపీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ తప్పదనే అంటున్నారు విశ్లేషకులు.

కాగా జూన్ 26న లోక్‌సభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనుంది. 18వ లోక్‌సభ సమావేశాలు జూన్ 24న తొలిసారిగా ప్రారంభమయ్యి జూలై 3న ముగుస్తాయి.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×