BigTV English

ASSEMBLY ELECTIONS : మిజోరాం, ఛత్తీస్‌గడ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

ASSEMBLY ELECTIONS :  మిజోరాం, ఛత్తీస్‌గడ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

ASSEMBLY ELECTIONS : మిజోరాం, ఛత్తీస్‌గడ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. మిజోరాంలోని 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాలకు గాను నేడు 20 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.


ఈ 20 కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 7 జిల్లాల్లో జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌‌లో ఇవాల జరుగుతున్న 20 స్థానాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లోనే ఉన్నాయి. దీంతో.. 40 వేల మంది సీఆర్‌పీఎఫ్, 20 వేల మంది రాష్ట్ర పోలీసులతో కలిపి మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా ఏర్పాట్లు చేశారు.

తొలి విడతలో 223 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. నేడు జరగబోయే 20 స్థానాల పోలింగ్ బరిలో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్ ముగుస్తుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ 5 గంటల వరకు కొనసాగుతుంది అని తెలిపారు. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.

ఇక మిజోరం విషయానికి వచ్చినట్టైతే.. 174 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 లక్షల 57 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12వందల 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంది.

డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటించనున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×