E-Paper
Advertisement

Rahul Gandhi : రాజస్థాన్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర.. ప్రియాంక దంపతుల స్పెషల్ అట్రాక్షన్.

Rahul Gandhi : రాజస్థాన్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర.. ప్రియాంక దంపతుల స్పెషల్ అట్రాక్షన్.
Advertisement

Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం బండి జిల్లా నుంచి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ… రాహుల్ ముందుకు సాగుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ గాంధీ ఎండగడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణే లక్ష్యంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు రాహుల్ ను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి సమస్యలు వింటున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే సుపరిపాలన తెస్తామని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..కశ్మీర్ వరకు సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల్లో యాత్ర పూర్తైంది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×