BigTV English
Advertisement

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

Several People dead in Stampede: తమిళనాడలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటు చేసుకుని పలువురు మృతిచెందారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆదివారం ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. లక్షలాదిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ షో ముగిసిన తరువాత ప్రజలు అక్కడి నుంచి తరలివెళ్తున్న క్రమంలో రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వందలాదిమందికి గాయాలైనట్లు సమాచారం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఊహించినదాని కంటే అధికంగా ప్రజలు ఎయిర్ షోకు తరలి రావడంతో ఈ విషాదం చోటు చేసుకున్నదని చెబుతున్నారు. భారీగా జనం తరలిరావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారని అంటున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.


Also Read: 6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు


Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×