Big Stories

6 Killed in UP Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఉత్తర ప్రదేశ్ కారు యాక్సిడెంట్ లో ఆరుగురు స్పాట్ డెడ్!

6 Killed on Uttar Pradesh Car Accident: అర్ధరాత్రి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీకొన్నది. దీంతో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం యూపీలో చోటు చేసుకుంది.

- Advertisement -

ఉత్తరప్రదేశ్ లోని బ్రజ్ ఘాట్ టోల్ ప్లాజా సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Also Read: తొలిసారిగా ఓటు వేస్తున్నానంటూ దున్నపోతుపై వచ్చి ఓటు వేసిన యువకుడు

అయితే, డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడని, ఆ తరువాత ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరిలించారు. సోమవారం అర్థరాత్రి రోడ్డుప్రమాదం జరిగిందని, బాధితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News