E-Paper
Advertisement

వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ,

వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ,
Advertisement

Weather News: ఎండలతో అల్లాడిపోతున్న సామాన్యులకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అందుకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

Advertisement

ఎండలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎండలు మండిపోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నా, మరుసటి రోజు మళ్లీ ఎండలు తమ ప్రతాపం చూపుతున్నాయి. సాయంత్రం అయితే చాలు కాస్త చినుకులు రాలితే హాయిగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పేసింది.

మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరుతాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా పేర్కొంది. కేరళకు మే రెండోవారం చివరినాటికి రుతుపవనాలు రావచ్చని వెల్లడించింది. తుఫాను వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

2026 మే 16 నాటికి అండమాన్ & నికోబార్ దీవులకు చేరుకుంటాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మే 14న అంటే గురువారం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండనుంది.

మే 13-19వరకు అండమాన్ & నికోబార్ దీవుల్లో ఉరుములు-మెరుపులతో గాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంగానది పరివాహక ప్రాంతంలో మే 14 తర్వాత వాతావరణ పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్‌ల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది.

ALSO READ: వ్యూహం ఫలించింది.. 15వ నౌక సేఫ్.. భారత్‌కు ఇక ఇంధన కష్టాలు తీరినట్టే?

మే 14న జార్ఖండ్‌, మే 16న బీహార్‌లో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని తెలిపింది. బీహార్, జార్ఖండ్‌ల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది. మే 14న జార్ఖండ్‌, మే 16న బీహార్‌లో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని తెలిపింది. ముందస్తు మార్పు రుతుపవనాల ప్రారంభానికి సంకేతం అయినప్పటికీ, మే నెల మధ్య వరకు ఈశాన్య భారత్.. దక్షిణ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×