E-Paper
Advertisement

Army Defuses Bombs: రెండు గ్రామాల మధ్య అమర్చిన బాంబులు.. రోడ్డుపై వెళ్తుండగా చూసి..

Army Defuses Bombs: రెండు గ్రామాల మధ్య అమర్చిన బాంబులు.. రోడ్డుపై వెళ్తుండగా చూసి..
Advertisement

Army Defuses Bombs: మణిపూర్‌లో రోడ్డుపై అమర్చిన బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేసారు. వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించగా అక్కడకు వచ్చిన స్క్వాడ్ బాంబులను నిర్వీర్యం చేశారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని నోంగ్ డామ్, ఇథమ్ గ్రామాలను కలిపే రహదారిపై ఐఈడీలను అమర్చగా ఆర్మీ సిబ్బంది ఆదివారం వాటిని గుర్తించారు.

ఆర్మీ జవాన్లు తనిఖీలు నిర్వహిస్తుండగా రోడ్డుపై అమర్చిన 3 ఐఈడీలను గుర్తించినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. ఇథమ్, నోండ్ డామ్ గ్రామాల సమీపంలో  బాంబులు అమర్చినట్లు తెలిపారు. బాంబు స్క్వాడ్ సహాయంతో రోడ్డుపై అమర్చిన ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. సకాలంలో స్పందించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా నిరోధించామని వెల్లడించారు.

Advertisement

“రొటీన్ ఏరియా-డామినేషన్ ,నిఘా ఆపరేషన్ సమయంలో, ఆర్మీ సిబ్బంది మూడు IEDలను రహదారి వెంట ఉంచడాన్ని గమనించారు. ఆర్మీ సిబ్బంధి వేగంగా పనిచేసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది” అని రక్షణ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

Advertisement

జాతి హింస, ఆధిపత్య తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన ఒక సంవత్సరం తర్వాత కూడా మణిపూర్ లో ఇంకా సాధారణ పరిస్థితి నెలకొనడం లేదు. దీంతో రెండు గ్రామాలు కలిసే సున్నిత ప్రాంతాలపై, ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లోయ చుట్టుపక్కల ఉన్న పర్వత ప్రాంతాలపై భద్రతా దళాలు నిఘా ఉంచాయి.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×