BigTV English

Train Accident : ఘోర ప్రమాదం.. పదుల సంఖ్యలో మృతి.. వందల మందికి గాయాలు

Train Accident : ఘోర ప్రమాదం.. పదుల సంఖ్యలో మృతి.. వందల మందికి గాయాలు

Train Accident : ఒడిశా రైలు ప్రమాదాన్ని తలపించే మరో రైలు ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘోర రైళ్ల ప్రమాదంలో 15 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా తీవ్రగాయాలైనట్లు సమాచారం. ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.


బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరబ్ వద్ద ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఢాకా వెళ్లే గోధూలీ ఎక్స్‌ప్రెస్ ఛటోగ్రామ్‌కు వెళ్తున్న కార్గో రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు రైలు సేవలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడి ఉంటారని, రైలు కింద చాలా మంది చిక్కుకుపోయారని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

“మేము 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము, చాలా మంది గాయపడ్డారు” అని భైరబ్‌లోని ప్రభుత్వ నిర్వాహకుడు సాదికుర్ రెహ్మాన్ స్థానిక మీడియాకు తెలిపారు. బోల్తా పడిన కోచ్ ల కింద మృతదేహాలు నగిలిపోయి, చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు.


Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×