E-Paper
Advertisement

Train Accident: బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. వంతెన పైనుంచి పడిపోయిన 19 బోగీలు!

Train Accident: బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. వంతెన పైనుంచి పడిపోయిన 19 బోగీలు!
Advertisement

Train Accident: బిహార్‌ రాష్ట్రంలోని జముయి జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం సిమెంట్‌ లోడ్‌తో ఆసన్‌సోల్‌ నుంచి సీతామఢీకి వెళ్తున్న గూడ్స్ రైలు సిములతాలా రైల్వే స్టేషన్ సమీపంలోని టెల్వాబజార్‌ హాల్ట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒక ఎత్తైన వంతెన (కల్వర్టు) పై జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పడంతో, సుమారు 19 బోగీలు ఒకదానిపై ఒకటి పడి వంతెన కిందకు దొర్లిపోయాయి. ఒక్కొక్క బోగీలో వందలాది సిమెంట్ మూటలు ఉండటంతో, అవి కింద పడిన ధాటికి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పాటు ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో రైలు ఇంజిన్ బోగీలకు విడిపోయి సుమారు 400 మీటర్ల దూరం ముందుకు వెళ్లి ఆగింది. అదృష్టవశాత్తూ ఈ ఘోర ప్రమాదంలో లోకోపైలట్‌, అసిస్టెంట్ లోకోపైలట్, గార్డు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇంజిన్ పట్టాలు తప్పకపోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ క్రేన్ల సహాయంతో బోగీలను తొలగించే పనులు ప్రారంభించారు. అయితే, వంతెన కింద బోగీలు పడిపోవడం, సిమెంట్ మూటలు చెల్లాచెదురుగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది.

Advertisement

Also Read: పర్యాటకుల కళ్లముందే విషాదం.. సముద్రంలో కూలిన విమానం.. స్పాట్‌లో!

ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కిలోమీటరు మేర పట్టాలు దెబ్బతినడం, విద్యుత్ లైన్లు తెగిపోవడంతో హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, ఇతర మార్గాల్లోకి రైళ్లను మళ్లించారు. పట్టాలు ఎందుకు తప్పాయి అనే విషయంపై రైల్వే శాఖ సాంకేతిక విచారణకు ఆదేశించింది. ట్రాక్ నిర్వహణ లోపమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×