E-Paper
Advertisement

Uttarpradesh: ఊయలలో ఉన్న చిన్నారి ముఖంపై పేడేసిన గేదె.. ఊపిరాడక మృతి

Uttarpradesh: ఊయలలో ఉన్న చిన్నారి ముఖంపై పేడేసిన గేదె.. ఊపిరాడక మృతి

Uttarpradesh: చిన్నారి ముఖంపై గేదె పేడ వేయడంతో ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో బుధవారం (డిసెంబర్ 6) సాయంత్రం జరిగింది. కుల్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతారి గ్రామానికి చెందిన ముఖేశ్ యాదవ్, భార్య నికిత వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి యాదవేంద్ర (3), ఆయుష్ (6 నెలలు) అనే ఇద్దరు మగపిల్లలున్నారు. బుధవారం సాయంత్రం నికిత గేదెలకు మేత వేసేందుకు వెళ్లగా.. అదే సమయంలో ఆయుష్ ఏడవడం మొదలుపెట్టాడు.

దాంతో తల్లి నికిత చిన్నారిని పశువుల పక్కనే కట్టిన ఊయలలో పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత చూసిన తల్లి షాకైంది. ఆ చిన్నారి ముఖంపై గేదె పేడ వేయడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ముఖంపై పేడ ఉండటం వల్ల ఊపిరాడక చిన్నారి మరణించినట్లు జిల్లా ఆసుపత్రి మెడికల్ ఇన్ ఛార్జ్ డాక్టర్ పంకజ్ రాజ్ పుత్ తెలిపారు. పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×