Tamilnadu Politics: తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడ్డాయా? ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో కొత్త పొత్తులు తెరపైకి రానున్నాయా? డీఎంకే-అన్నాడీఎంకె కూటమిగా ఏర్పడాలని భావిస్తున్నాయా? గురువారం జరిగిన పరిణామాలతో టీవీకే పార్టీ అలర్ట్ అయ్యిందా? అదే జరిగితే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని ఆ పార్టీ డిసైడ్ అయ్యిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తమిళనాట రాజకీయాలు మరో మలుపు.. డీఎంకె-అన్నాడీఎంకె కూటమిగా ఏర్పాటైతే
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే పార్టీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో డీఎంకె-అన్నాడీఎంకె పార్టీలు సిద్ధమయ్యాయి. గడిచిన రెండురోజులుగా జరిగిన, జరుగుతున్న, జరగబోయే పరిణామాలపై కీలక నేతలంతా చర్చించారు.
ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం- టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సిద్ధమైతే తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఆ తరహా వార్తలు జోరందుకున్నాయి.
మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీవీకే పార్టీ
ప్రజాదరణ పొందిన టీవీకే పార్టీని పక్కనపెట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకె-అన్నాడీఎంకెలు కుమ్మక్కయ్యాయని టీవీకే పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు మెజారిటీ మార్కును సాధించడానికి టీవీకేకి మరో 5 సీట్లు అవసరమైంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది.
మిగిలిన సీట్ల కోసం వామపక్షాలు,చిన్న పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. లేకుంటే న్యాయస్థానం తలుపు తట్టాలని టీవీకే పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా గురువారం కూటమి నేతలతో భేటీ అయ్యారు డీఎంకె అధినేత స్టాలిన్. ఆ సమావేశంలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ALSO READ: ఈయనకు ఏమైనా పిచ్చా? ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?
పార్టీ అధినేత ఎంకె స్టాలిన్కు అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇవ్వడం, మరోసారి ఎన్నికలకు వెళ్లకుండా నివారించడం, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మత శక్తులకు తావు ఇవ్వకపోవడం చేయడమే నాలుగు అంశాల అజెండా తెలుస్తోంది. జాతీయ వార్తల నేపథ్యంలో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.