E-Paper
Advertisement

నేడే బెంగాల్, తమిళనాడు ఎన్నికలు.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం.. ఓట్లు వేస్తున్న ప్రజలు!

నేడే బెంగాల్, తమిళనాడు ఎన్నికలు.. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం.. ఓట్లు వేస్తున్న ప్రజలు!

Election Polling 2026: బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ మెుదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలు తెరుచుకోగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. తమిళనాడులోని 234 స్థానాలకు ఇవాళే పోలింగ్ జరగనుండగా.. బెంగాల్ లో మాత్రం తొలి విడతగా 152 స్థానాలకు మాత్రమే ఓటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29న బెంగాల్ లో రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల జరిగిన అసోం, కేరళ, పుదుచ్చేరిలతో కలిపి మే 4న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

16 జిల్లాలు, 3.6 కోట్ల ఓటర్లు..

ప్రస్తుతం యావత్ దేశం దృష్టి బెంగాల్ లో జరగబోయే ఎన్నికలపైనే ప్రధానంగా ఉంది. కేంద్రంలోని బీజేపీ, సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. బెంగాల్ లో మెుత్తం 294 నియోజకవర్గాలకు గాను తొలివిడతలో 16 జిల్లాల పరిధిలోని 152 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 3.6 కోట్ల మంది ఓటర్లు ఈ రోజు ఓటువేయనున్నారు. నందిగ్రామ్, డార్జిలిం్, సిలిగురి, జుల్పైగురి, కూచ్ బెహాక్ తో సహా కనీసం 80 స్థానాల్లో హోరా హోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also Read: Intinti Ramayanam Today Episode: అవనికి భరత్ దిమ్మతిరిగే షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్.. రాజేశ్వరికి స్ట్రాంగ్ వార్నింగ్..

తమిళనాడు ఎన్నికలు..

ఇక తమిళనాడు విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలో మెుత్తం 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో కోలత్తూరు, ఎడప్పాడి, తిరుచిరాపల్లి ఈస్ట్, కోయంబత్తూరు వెస్ట్, డాక్టర్ రాధాకృష్ణ నగర్ వంటి అతి కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. ఓటర్ల విషయానికి వస్తే తమిళనాడులో మెుత్తం 5.73 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 2.93 కోట్ల మంది మహిళా ఓటర్లు. ఈ ఎన్నికల కోసం 33,133 ప్రాంతాల్లో 7,728 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటలకు మెుదలైన ఈ పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుందని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలందరూ ఓటు వేసేందుకు వీలుగా ఇవాళ తమిళనాడులో పబ్లిక్ హాలీడేను సైతం ప్రకటించారు.

బెంగాల్లో హోరాహోరీ

పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎన్నికలు హోరా హోరీగా సాగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య అధికారం కోసం నువ్వా నేనా అన్న ఫైట్ నడుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. బెంగాల్ లో ఈసారి ఎలాగైనా పాగా వేసేందుకు సర్వశక్తులు వడ్డినట్లు తెలుస్తోంది. 2011లో 35 ఏళ్ల సీపీఎం ప్రభుత్వాన్ని కూలదోసిన మమతా.. అప్పటి నుంచి బెంగాల్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. చివరిగా జరిగిన 2021 ఎన్నికల్లో ఏకంగా 215 స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటారు. అయితే ఈసారి భారీగా నకిలీ ఓట్ల తొలగింపు, ప్రధాని మోదీ, అమిత్ షా ధ్వయం బెంగాల్ ఎన్నికలను ప్రతీష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఈసారి ఫలితాలు ఏవిధంగా ఉంటాయన్న ఉత్కంఠ ఏర్పడింది. గత 15 ఏళ్ల కాలంలో బెంగాల్లో పెరిగిపోయిన అవినీతి, శాంతి భద్రతల సమస్యలు, అభివృద్ది లేమి వంటి అంశాలు ఈసారి దీదీకి ప్రతీకూలంగా మారొచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Also Read: Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 23: ఆ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×