Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. వందే మాతరం గేయానికి జాతీయ హోదా కల్పించాని నిర్ణయించింది. అందుగాను కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయనుంది. పూర్వం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశభక్తిని పెంచడానికి సెగలు రేపిన అమర గీతంగా వందేమాతరం గేయాన్ని పాడేవారు. దీంతో ఇప్పుడు కేధ్ర ప్రభుత్వం దీనికి చట్టబద్దత కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో వందేమాత గేయాన్ని అవమానిస్తే చట్టరీత్యా నేరం అయితే దీనికి సంభందించిన బిల్లును వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తుంది. దీని కోసం కేంద్రం 1971 నాటి చట్టాన్ని సవరిస్తూ వందేమాతరాన్ని అందులో చేర్చాలని భావిస్తుంది. జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం తరహాలో వందేమాతరానికి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసోనుంది.
Also read: SVIMS Admissions: తిరుపతి స్విమ్స్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!
అయితే ప్రస్థుతం మన దేశంలో జాతీయ చిహ్నాలను గౌరవాన్ని కాపాడేందుకు ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, లేదా జాతీయ గీతాన్ని దేశంలో ఏవరైనా అవమానిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అయితే చట్టంలో ఇప్పటి వరకు జాతీయ గేయం అయిన వందేమాతరానికి తగిన ప్రాదాన్యమైన చట్టం లేదు. దీంతో 1971 నాటి చట్టానికి కేంద్ర ప్రభుత్వం సంవరణలు చేసి బిల్లును వర్షాకాల సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలనుకుంటుంది.
Also Read: Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!