E-Paper
Advertisement

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్
Advertisement

Jantar Mantar: ఢిల్లీలో నిరసనలు అంటే అందరికీ వేదిక జంతర్ మంతర్ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ వేదిక  మారబోతోందా? అదే వేదిక కంటిన్యూ అవుతోందా? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. అక్కడ నిరసనల వల్ల ప్రజలకు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. మరి న్యాయస్థానం నిర్ణయం ఏ విధంగా ఉంటుందో? అన్న ఆసక్తి అప్పుడే మొదలైంది.

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై?

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా రాజకీయ పార్టీలు, యూనియన్లు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుంటాయి. దీనివల్ల తమ వాయిస్ ప్రభుత్వానికి వినిపిస్తుందని బలంగా నమ్ముతారు. నిరసనలకు ఈ ప్రాంతం అనువైన వేదిక కాదన్నది పిటిషన్ వాదన. ఆందోళనలతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నిరసనల వల్ల అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోందని అందులో ప్రస్తావించాడు పిటిషన్. నిరసనలు చేపట్టేందుకు ప్రత్యామ్నాయంగా మరొక వేదిక కేటాయించేలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.

కొత్త వేదిక ఎక్కడ? సుప్రీంకోర్టులో పిటిషన్

Advertisement

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని ఇంటి వరకు చేపట్టనున్న పాదయాత్ర గురించి అందులో ప్రస్తావించారు. జులై 20 నాటి పరిస్థితులు చోటు చేసుకోకుండా నివారించాలని అందులో ప్రస్తావించాడు. దీనిపై వాదనలు వినేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్రం-సంబంధిత యంత్రాంగాలకు నోటీసులు ఇచ్చింది.

ఆప్ పాదయాత్రపై కూడా రియాక్ట్

ముఖ్యమైన విషయమని తాము భావిస్తున్నామని, దీనిపై సంబంధిత అధికారుల నుంచి సూచనలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆదేశించారు. పాదయాత్ర విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో భద్రతా సిబ్బందికి తెలుసని, వారు సరిగా నిర్వహించని పక్షంలో మమ్మల్ని సంప్రదించవచ్చని సూచన చేశారు. ఈ విషయాన్ని విడిగా విచారణ చేయనుంది న్యాయస్థానం.

Advertisement

ALSO READ:  అమెరికా చదువులపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన సీజేపీ ఫౌండర్

Related News

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

గ్యాస్ సబ్సిడీ కోసం వెళ్తే.. ఖాతాలో రూ. 100 కోట్లు.. నివ్వెరపోయిన పేద మహిళ!

అమెరికా చదువులపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన సీజేపీ ఫౌండర్!

బీజేపీ కంచుకోట బంకీపూర్‌పై పీకే కన్ను, ఆధిక్యం దిశగా ప్రశాంత్ కిషోర్

వీడేవడండీ బాబోయ్! ముసలిని భుజంపై మోసుకెళ్తున్నాడు.. వీడియో వైరల్!

చాయ్‌వాలాజ్‌ ఫౌండర్ ఆత్మహత్య.. 17 ఏళ్లకు వ్యాపారంలోకి ఎంట్రీ, ఇంట్లో ఎవరూ లేనప్పుడు

Big Stories

Advertisement
×