E-Paper
Advertisement

Pune: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ

Pune: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ
Advertisement

Pune: మంచి జీతం.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. అయినా కూడా ఆమెకు స్యాటిస్‌ఫాక్షన్ లేదు. నిత్యం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలే. ఈక్రమంలో ఉద్యోగానికే రాజీనామా చేసింది ఆ మహిళ. ప్రజల కోసం ఆర్టీసీ డ్రైవర్‌గా మారింది.

పుణెకు చెందిన శీతల్ శిందే అని మహిళ 2014 నుంచి నాలుగేళ్ల పాటు యాక్సిక్ బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహించింది. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉండి.. చివరికి మహారాష్ట్ర ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరింది.

Advertisement

2019లో మహారాష్ట్ర ఆర్టీసీ మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించగా.. శీతల్ దానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో మొత్తం 194 మంది మహిళలు ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి రావడం… లాక్‌డౌన్ విధించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో చివరకు కేవలం 17 మంది మహిళలు మాత్రమే మిగిలారు. వారిలో ఒకరు శీతల్ శిందే. ఈ ఏడాది మార్చిలో శీతల్ విధుల్లో చేరనుంది.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×