Sampradayani Suppini Suddapoosa:ఒకప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు శివాజీ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు..ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈయన 90′ స్ బయోపిక్ తో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ వెను తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత కోర్ట్ , దండోరా తోపాటు మరికొన్ని చిత్రాలలో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అటు బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిలో శివన్నగా పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి శివాజీ ఇటీవల నటించిన చిత్రం ‘సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’. ఒకప్పుడు తనతో మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం వంటి చిత్రాలతో జంటగా నటించి.. ఆకట్టుకున్న లయతో మళ్లీ 14 ఏళ్ల తర్వాత సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు శివాజీ.
ఇకపోతే ఈ సినిమాను మొదట థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమాకి వస్తున్న ఆదరణను గుర్తించి ఓటీటీలో కాకుండా మళ్లీ నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలని శివాజీ నిర్ణయం తీసుకున్నారు. అలా మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.. ఇకపోతే ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శివాజీ , లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ వేదికగా ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికైతే డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
also read:రంగస్థలం @8ఏళ్లు.. ఎవరికి తెలియని తెరవెనుక విషయాలు?
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. శ్రీరామ్ (శివాజీ) నిజాయితీపరుడైన ఒక పంచాయతీ కార్యదర్శి.. కొత్తకోట సమీపంలోనే హార్సిలీ హిల్స్ లో భార్య ఉత్తర (లయ) , కొడుకు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్) తో తన కొడుకు చేసే తింగరి పనులు శ్రీరామ్ కి పెద్ద తలనొప్పిగా మారుతూ ఉంటాయి. ఒకరోజు దీపావళి రోజున వాళ్ళ ఇంటికి ఆ వూరు ఎస్ఐ విక్రం వాసుదేవ్ వస్తాడు. అతడికి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువం అప్పటికే శ్రీరామ్ తో ఒకసారి గొడవ కూడా జరిగి ఉంటుంది..శ్రీ రామ్ ఇంట్లో ఎవ్వరూ లేరని తెలిసి ఉత్తరపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తాడు. కట్ చేస్తే అనూహ్యంగా శ్రీరామ్ కొడుకు చేతిలో ఆ ఎస్సై విక్రమ్ హత్యకు గురవుతాడు. ఇక ఆ తర్వాత ఏమయ్యింది ? ఈ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు శ్రీరామ్ ఏం చేశాడు ? ఆ శవాన్ని మాయం చేయడానికి వాళ్ళు పడిన తిప్పలు ఏమిటి ? నిజంగా విక్రమ్ హత్యకు, శ్రీరామ్ కొడుకుకి ఏదైనా సంబంధం ఉందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.