
CM Revanth Reddy Vs Lionel Messi Match( Source / Twitter )
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది..

CM Revanth Reddy Vs Lionel Messi Match( Source / Twitter )
ఈ మ్యాచ్లో మెస్సీ టీమ్పై సింగరేణి ఆర్ఆర్ టీమ్ 3-0 గోల్స్తో గెలిచింది. ఆర్ఆర్ టీమ్ తరఫున సీఎం రేవంత్రెడ్డి ఆడి ఓ గోల్ కొట్టారు.. కేవలం కొన్ని నిమిషాల్లోనే విన్నర్ గా నిలిచారు.

CM Revanth Reddy Vs Lionel Messi Match( Source / Twitter )
ఈ మ్యాచ్ తర్వాతజట్లకు మెస్సీ పతకాలు అందజేశారు. ఇక్కడకు వచ్చి తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి వారు చూపించిన అభిమానం మనసు దోచుకుందని అన్నారు..

CM Revanth Reddy Vs Lionel Messi Match( Source / Twitter )
మ్యాచ్కి ముందు రెండు టీమ్లతో మెస్సీ, రేవంత్ రెడ్డి ఫొటోలు దిగారు. ఈ మ్యాచ్ను రాహుల్ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ పిల్లలు కూడా మ్యాచ్ ను తిలకించారు.

CM Revanth Reddy Vs Lionel Messi Match( Source / Twitter )
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మెస్సిని ప్రత్యక్షంగా చూడడానికి వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు...

CM Revanth Reddy Vs Lionel Messi Match( Source / Twitter )
ఏడుగురు ఆటగాళ్లతో కూడిన జట్లు 20 నిమిషాల పాటు పోటీపడ్డాయి..ముఖ్యమంత్రి స్వయంగా గోల్ చేయడంతో స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.