WhatsApp: ఈ రోజుల్లో వాట్సప్ వాడని వారంటూ ఎవరూ లేరు. ఒక చిన్న మెసేజ్, ఫొటో లేదా వీడియోను క్షణాల్లో వందల మందికి చేరవేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఇదే సమయంలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం కూడా అంతే వేగంగా వైరల్ అవుతోంది. దీన్ని అరికట్టేందుకు వాట్సప్ కొన్ని కీలకమైన నిబంధనలను తీసుకువచ్చింది. మీరు కూడా తరచూ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తుంటే.. ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి.
వాట్సప్ నిబంధనల ప్రకారం.. మీరు ఏదైనా ఒక మెసేజ్ను ఒకేసారి గరిష్టంగా ఐదు చాట్లు లేదా గ్రూపులకు మాత్రమే ఫార్వర్డ్ చేయగలరు. అంతకంటే ఎక్కువ మందికి పంపడం సాధ్యం కాదు. ఒకవేళ ఆ మెసేజ్ ఇప్పటికే బాగా వైరల్ అయి ఉంటే, దానిపై Forwarded Many Times అనే లేబుల్ కనిపిస్తుంది. అలాంటి మెసేజ్లను మనం ఒకేసారి ఒకే ఒక్క చాట్కు మాత్రమే ఫార్వర్డ్ చేయగలం. వైరల్ వార్తలకు బ్రేక్ వేసేందుకే మెటా సంస్థ ఈ పరిమితిని విధించింది.
Also Read: షాకింగ్.. Google Pixel 10పై రూ.15 వేలకు పైగా తగ్గింపు.. ఈ ప్రైస్కి ఇప్పుడు కొనడం వర్తా?
మనం పంపే ఫార్వర్డ్ మెసేజ్లను వాట్సప్ గమనిస్తుందా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. కానీ, వాట్సప్లో end-to-end encryptionటెక్నాలజీ ఉంటుంది. దీనివల్ల మెసేజ్ పంపిన వారికి, అందుకునే వారికి తప్ప మధ్యలో మరెవరికీ ఆ సమాచారం కనిపించదు. వాట్సప్ కేవలం ఆ మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయిందనే సంఖ్యను మాత్రమే ట్రాక్ చేస్తుంది తప్ప, అందులో ఏముందో చదవలేదు. కాబట్టి.. మీ వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు.
కొన్నిసార్లు పరిమితి దాటకపోయినా మెసేజ్లు ఫార్వర్డ్ కావు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం సాంకేతిక సమస్య కావచ్చు. దీనికోసం ముందుగా మీ ఫోన్ను ఒకసారి రీస్టార్ట్ చేసి చూడండి. అలాగే మీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లోకి వెళ్లి వాట్సప్ యాప్ను లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ చేసుకోండి. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) పాతదైనా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి కాబట్టి.. ఫోన్ను కూడా అప్డేట్ ఉంచడం మంచిది.
Also Read: Samsung Galaxy S26 ఫోన్కు One UI 9 అప్డేట్ విడుదల.. కొత్త AI ఫీచర్లు, కీలక మార్పులు ఇవే!