Oppo Find X8 Neo 5G: స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరోసారి సంచలనంగా మారింది ఓప్పో. ఈ కంపెనీ ప్రతి సారి కొత్త టెక్నాలజీతో, ఆకర్షణీయమైన డిజైన్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఒప్పో ఫైండ్ ఎక్స్8 నియో 5జి అనే ఫోన్ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఒక్కటే కాదు దీని స్పెసిఫికేషన్లు చూస్తే ఏ ఫ్లాగ్షిప్ ఫోన్కైనా పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నాయి.
డిజైన్ – ఫ్లాగ్షిప్ లుక్
ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే ఈ ఫోన్ను చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం అనిపించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. స్లిమ్ బాడీ, కర్వ్ ఎడ్జ్ డిస్ప్లే, వెనుక భాగంలో గ్లాస్ ఫినిషింగ్తో ఉన్న కెమెరా మాడ్యూల్ మొత్తం చూసినప్పుడు ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ లుక్తో మెరిసిపోతుంది. కేవలం 7.8 మిల్లీమీటర్ల మందం, సుమారు 186 గ్రాముల బరువుతో చాలా కంఫర్ట్గా ఉంటుంది.
6.78 అంగుళాల అమోలేడ్ డిస్ప్లే
డిస్ప్లే విషయానికి వస్తే, ఒప్పో ఫైండ్ ఎక్స్8 నియోలో 6.78 అంగుళాల అమోలేడ్ 1.5కె రిజల్యూషన్ డిస్ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్తో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో ప్లేబ్యాక్ అనుభవం చాలా స్మూత్గా ఉంటుంది. హెచ్డిఆర్ 10 ప్లస్ సపోర్ట్ కూడా ఉంది. బ్రీట్ అవుట్డోర్ లైట్లో కూడా కంటెంట్ క్లియర్గా కనిపించేలా 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు.
200ఎంపి సోని IMX907 ప్రైమరీ కెమెరా
ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ ఫోన్ యొక్క హైలైట్ అదే. ఒప్పో ఫైండ్ ఎక్స్8 నియోలో 200ఎంపి సోని ఐఎంఎక్స్907 ప్రైమరీ కెమెరా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా క్లోజ్ షాట్లైనా, లాంగ్ రేంజ్ ఫోటోలైనా అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది. దీని తో పాటు 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. రాత్రి టైంలో కూడా డిటైల్స్ లాస్ కాకుండా ఫోటోలు రావడం దీని స్పెషాలిటీ. ఫ్రంట్ కెమెరా విషయంలో కూడా ఓప్పో ఎలాంటి రాజీ పడలేదు, 32ఎంపి సోని సెన్సార్ ఇచ్చారు. సెల్ఫీలలో స్కిన్ టోన్, డీటైల్, కలర్ రిప్రొడక్షన్ అద్భుతంగా ఉంటుంది.
స్నాప్డ్రాగన్ 8s జెన్ 3 చిప్సెట్
పనితీరుపై వస్తే, ఒప్పో ఫైండ్ ఎక్స్8 నియోలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4nm టెక్నాలజీతో తయారైన అత్యంత వేగవంతమైన ప్రాసెసర్. గేమింగ్ అయినా, మల్టీటాస్కింగ్ అయినా ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా నడుస్తుంది. దీని తో పాటు అడ్రినో 735 జిపియూ ఉన్నందున హెవీ గేమ్స్ కూడా సులభంగా ఆడవచ్చు.
12జిబి ఎల్పిడిడిఆర్5ఎక్స్ ర్యామ్
రామ్, స్టోరేజ్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 12జిబి ఎల్పిడిడిఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తుంది. అదనంగా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది, అంటే అవసరమైతే మరో 12జిబి వరకు రామ్ లాగా ఉపయోగించుకోవచ్చు. స్టోరేజ్ 256జిబి/512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది.
5000mAh బ్యాటరీ
ఇప్పుడు బ్యాటరీ – ఛార్జింగ్ గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీ ఉంది. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని 120W సూపర్వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కేవలం 15 నిమిషాల్లోనే ఫోన్ 0 నుండి 100శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఓప్పో ఈ ఫీచర్లో ఎప్పుడూ ముందుంటుంది, ఈసారి కూడా అదే నిరూపించింది.
సాఫ్ట్వేర్ – సెక్యూరిటీ
సాఫ్ట్వేర్ విషయంలో ఒప్పో ఫైండ్ ఎక్స్8 నియో 5జి ఆండ్రాయిడ్15 ఆధారంగా రూపొందించిన కలర్స్ ఓఎస్ 15 మీద రన్ అవుతుంది. ఇందులో ఏఐ ఆధారంగా కొత్త ఫీచర్లు ఉన్నాయి. లైవ్ ట్రాన్స్లేషన్, స్మార్ట్ మల్టీ స్క్రీన్, ఫోటో క్లీనర్ వంటి ఫీచర్లు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇక సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, స్మార్ట్ ప్రైవసీ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే డాల్బీ అట్మోస్ స్పీకర్లు ఉండటంతో ఆడియో అనుభవం థియేటర్ లెవల్లో ఉంటుంది.
వైఫై 7, బ్లూటూత్ 5.4
ఇక నెట్వర్క్ విషయానికి వస్తే, పేరు చెప్పినట్టే ఇది 5జి ఫోన్. అలాగే వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సి, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వంటి అన్ని ప్రీమియం కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
ధర ఎంతంటే?
ఇప్పుడు ధర గురించి మాట్లాడితే చైనాలో ఈ ఫోన్ 12జిబి ప్లస్ 256జిబి వేరియంట్ ధర సుమారు రూ.42,999 లకు సమానంగా ఉంది. ఇండియాలో వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్కి వస్తే దీని ధర రూ.44,999 నుంచి రూ.46,999 మధ్య ఉండొచ్చని అంచనా. ప్రీమియం ఫోన్ కావాలని అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.