E-Paper
Advertisement

Yadadri Bhuvanagiri: కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం.. సక్సెస్ అయిన ఉద్యోగవాణి

Yadadri Bhuvanagiri: కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం.. సక్సెస్ అయిన ఉద్యోగవాణి
Advertisement

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చేపట్టిన ఉద్యోగ వాణి కార్యక్రమం.. రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగుల సమస్యలు నేరుగా విని, వాటికి తక్షణ పరిష్కారం చూపించేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా ముందుకు రావడం పట్ల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

ఇది రాష్ట్రస్థాయిలో తొలిసారిగా జిల్లా స్థాయిలో నిర్వహించిన వినూత్న కార్యక్రమం. అటెండర్ స్థాయి ఉద్యోగి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు, ప్రతి ఒక్కరికి తమ సమస్యలను నేరుగా కలెక్టర్ ముందు చెప్పుకునే అవకాశం లభించింది.

Advertisement

జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వ్యక్తిగత, వేతన, బదిలీ, సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను వివరించారు. ప్రతి వినతి పత్రాన్ని జాగ్రత్తగా విని, తక్షణ పరిష్కారం సాధ్యమైన వాటిని వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఉద్యోగ వాణి లో ఉద్యోగులు కొందరు ఇచ్చిన సమస్యలు విని.. తమ పరిధిలో ఉన్న కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. మరి కొన్ని రాష్ట్ర స్థాయి లో ఉన్న సమస్యలపై సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి.. పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పై అధికారులు హామీ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

Advertisement

అక్కడ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న జాహెదా బేగం గత మూడు నెలలుగా వేతనం పొందలేదని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిచి, తక్షణమే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.

జిల్లాలో టి-స్వాన్ ప్రాజెక్ట్ ద్వారా పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి.. గత ఐదు నెలలుగా వేతనాలు అందలేదని తెలిపారు. కలెక్టర్ తక్షణమే రాష్ట్ర స్థాయి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సిబ్బందికి వెంటనే జీతాలు విడుదల చేయాలని ఆదేశించారు.

పంచాయతీ కార్యదర్శుల వినతి:
ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు కూడా వేతనాల లేమి గురించి వివరించారు. కలెక్టర్ ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించారు.

Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కీలక భేటీ

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చేపట్టిన ఉద్యోగ వాణి కార్యక్రమం ఇప్పుడు.. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా స్ఫూర్తిగా మారింది. అనేక జిల్లాల అధికారులు ఈ తరహా కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×