Sarvam Edge AI| బెంగుళూరుకు చెందిన దేశీ టెక్ కంపెనీ సర్వం AI సరికొత్త ఆఫ్లైన్ టెక్నాలజీ ఏఐ సర్వం ఎడ్జ్ లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫాం అడ్వాన్స్డ్ AIని స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలో డైరెక్ట్గా తీసుకొస్తుంది. ఇంటర్నెట్ లేకుండానే AI ఫీచర్లు ఉపయోగించవచ్చు. క్లౌడ్ సర్వర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. చాలా వేగంగా, సురక్షితంగా, నమ్మకంగా పనిచేస్తుంది. ప్రైవసీ పెంచడం, ఎక్కడైనా ఉపయోగించడం దీని ప్రధాన లక్ష్యం. ఇంటర్నెట్ బలహీనంగా లేదా అసలు నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కూడా బాగా పనిచేస్తుంది. డేటా లీక్ రిస్క్ తగ్గుతుంది.
సర్వం ఎడ్జ్ అనేది లోకల్ డివైస్లోనే AI మోడల్స్ రన్ చేసే ప్లాట్ఫాం. యూజర్ స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్లోనే డేటా అంతా ప్రాసెసింగ్ జరుగుతుంది. రిమోట్ డేటా సెంటర్లు అవసరం లేదు. ఆధునిక డివైస్లలో ఉన్న పవర్ఫుల్ ప్రాసెసర్లను ఉపయోగిస్తుంది. ఇంటర్నెట్ ఆలస్యం లేకుండా ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. పర్సనల్ డేటా డివైస్లోనే ఉంటుంది. ఇది యూజర్ ట్రస్ట్ పెంచుతుంది. డేటా సెక్యూరిటీ మెరుగవుతుంది. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, ట్రావెలర్లకు చాలా ఉపయోగకరం.
సర్వం ఎడ్జ్లో అడ్వాన్స్డ్ మల్టీలింగ్వల్ స్పీచ్ రికగ్నిషన్ ఉంది. 10 ప్రధాన భారతీయ భాషలు సపోర్ట్ చేస్తుంది. మీరు మాట్లాడే భాషను ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. మాన్యువల్గా భాష ఎంచుకోవాల్సిన అవసరం లేదు. వాయిస్ ఇంటరాక్షన్ సులభంగా, సహజంగా ఉంటుంది. ఆఫ్లైన్ డిజైన్ వల్ల రిమోట్ ప్రాంతాల్లో కూడా స్థిరంగా పనిచేస్తుంది.
టెక్స్ట్ను వాయిస్గా మార్చే బలమైన ఫీచర్ ఇందులో ఉంది. చిన్న మోడల్తో తక్కువ మెమరీ ఉపయోగిస్తుంది. బహుళ భాషల్లో టెక్స్ట్ను వాయిస్గా మారుస్తుంది. కంటిన్యూస్, క్లియర్ వాయిస్ అవుట్పుట్ ఇస్తుంది. యాక్సెసిబిలిటీ, కంటెంట్ క్రియేషన్, లెర్నింగ్, కమ్యూనికేషన్ అవసరాలకు బాగుంటుంది.
11 భాషల్లో (ఇంగ్లీష్తో సహా) ట్రాన్స్లేషన్ సపోర్ట్ చేస్తుంది. 110 విధాలుగా భాషలను పెయిర్ చేసి టూ-వే ట్రాన్స్లేషన్ చేస్తుంది. అన్నీ పూర్తిగా ఆఫ్లైన్లో పనిచేస్తాయి. ఇంటర్నెట్ అవసరం లేదు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలో స్మూత్గా రన్ అవుతుంది. స్పెషల్ హార్డ్వేర్ అవసరం లేదు. తక్కువ మెమరీ, త్వరిత రెస్పాన్స్ ఇస్తుంది.
లైవ్ ఆడియోను టెక్స్ట్గా తక్షణమే మారుస్తుంది. ఇమ్మీడియట్ ట్రాన్స్లేషన్ రిజల్ట్స్ ఇస్తుంది. మీటింగ్స్, ఆన్లైన్ లెర్నింగ్కు ఉపయోగకరం. చాలా యాప్స్, టూల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. ప్రొడక్టివిటీ, కమ్యూనికేషన్ మెరుగవుతాయి.
Also Read: ఆపిల్ కంపెనీలో పనిచేసే భారతీయుడికి రూ.200 కోట్లకు పైగా వేతనం.. సిఈఓ సాలరీ ఎంతో తెలుసా?
సర్వం ఎడ్జ్ AIని సాధారణ యూజర్లకు దగ్గర చేస్తుంది. ఇంటర్నెట్ పై ఆధారపడటం పూర్తిగా తొలగిస్తుంది. వేగవంతమైన పనితీరు, బలమైన ప్రైవసీ ఇస్తుంది. భారతదేశంలో వైవిధ్యమైన భాషలకు ఇది బెస్ట్ ఏఐ అని సర్వం చెబుతోంది. సర్వం AI దీన్ని రోజువారీ జీవితంలో ప్రాక్టికల్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ AI ఇన్నోవేషన్లో ఇది పెద్ద అడుగు.